PRINT TIME: March 18, 2026 09:02 PM
విశాలభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు
విశాలభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు
March 18, 2026 07:42 PM
4 Views
స్థానికం ప్రతినిధి :
CHOUTUPPAL MANDAL
K.RAVI
చౌటుప్పల్లోని శ్రీ గాయత్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశాల భారతి హైస్కూల్లో ముందస్తు ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విశాల భారతి హైస్కూల్ కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది పండుగ సృష్టి ఆరంభానికి సూచికగా భావించబడుతుందని తెలిపారు. వసంతకాలంలో తెలుగు సంవత్సరానికి ఆరంభమైన ఈ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.అలాగే ఉగాది పచ్చడిలోని షడ్ రుచులు మానవ జీవితంలోని సుఖదుఃఖాలను సూచించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమని విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోడెల ఆంజనేయులు,ఉపాధ్యాయులు,ఉపాధ్యాయినీలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి