Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:50 AM

విస్తరణ పూర్తి చేయాలి. సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ.

విస్తరణ పూర్తి చేయాలి. సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ.

విస్తరణ పూర్తి చేయాలి.  సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ.
08-06-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలోని సుభాష్ సెంటర్ నుంచి మల్లికార్జున రైస్‌మిల్ వరకు రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేసి, పట్టణ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రామన్నపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ మాట్లాడుతూ ఒకప్పుడు తాలూకా, నియోజకవర్గ కేంద్రంగా వెలుగొందిన రామన్నపేట నేడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. గ్రామపంచాయతీ హోదా ఉన్నప్పటికీ మౌలిక వసతుల అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరు విడిచి వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చినప్పుడు దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితులే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

పట్టణంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధాన రహదారిగా ఉన్న సుభాష్ రోడ్ ఇరుకుగా మారడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, భారీ వాహనాలు వచ్చినప్పుడు ద్విచక్ర వాహనదారులు, పాదచారులు పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పార్కింగ్ స్థలాల లేమితో వాహనాలు రోడ్డుపైనే నిలిపివేయడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని పేర్కొన్నారు.

గత పాలకులు రోడ్డు విస్తరణ హామీ ఇచ్చి అసంపూర్తిగా వదిలేశారని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా సమస్య పరిష్కారంపై దృష్టి సారించలేదని విమర్శించారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో సీపీఎం నాయకులు గాదె నరేందర్, గొరిగే సోములు, ఆముద ఆంజనేయులు, అప్పం సంతోష్, బావండ్లపల్లి సత్యం, తరిగొప్పుల వెంకటరెడ్డి, గంజి అశోక్, పల్లె సత్యం, బోళ్ల వెంకన్న, కుందూరు వెంకటేశ్వర్లు, రాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విస్తరణ పూర్తి చేయాలి. సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ.

Article Image

రామన్నపేట పట్టణంలోని సుభాష్ సెంటర్ నుంచి మల్లికార్జున రైస్‌మిల్ వరకు రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేసి, పట్టణ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రామన్నపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ మాట్లాడుతూ ఒకప్పుడు తాలూకా, నియోజకవర్గ కేంద్రంగా వెలుగొందిన రామన్నపేట నేడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. గ్రామపంచాయతీ హోదా ఉన్నప్పటికీ మౌలిక వసతుల అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరు విడిచి వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చినప్పుడు దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితులే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

పట్టణంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధాన రహదారిగా ఉన్న సుభాష్ రోడ్ ఇరుకుగా మారడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, భారీ వాహనాలు వచ్చినప్పుడు ద్విచక్ర వాహనదారులు, పాదచారులు పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పార్కింగ్ స్థలాల లేమితో వాహనాలు రోడ్డుపైనే నిలిపివేయడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని పేర్కొన్నారు.

గత పాలకులు రోడ్డు విస్తరణ హామీ ఇచ్చి అసంపూర్తిగా వదిలేశారని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా సమస్య పరిష్కారంపై దృష్టి సారించలేదని విమర్శించారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో సీపీఎం నాయకులు గాదె నరేందర్, గొరిగే సోములు, ఆముద ఆంజనేయులు, అప్పం సంతోష్, బావండ్లపల్లి సత్యం, తరిగొప్పుల వెంకటరెడ్డి, గంజి అశోక్, పల్లె సత్యం, బోళ్ల వెంకన్న, కుందూరు వెంకటేశ్వర్లు, రాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News