విస్తరణ పూర్తి చేయాలి. సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ.
విస్తరణ పూర్తి చేయాలి. సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ.
Editor Desk
రామన్నపేట పట్టణంలోని సుభాష్ సెంటర్ నుంచి మల్లికార్జున రైస్మిల్ వరకు రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేసి, పట్టణ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రామన్నపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ మాట్లాడుతూ ఒకప్పుడు తాలూకా, నియోజకవర్గ కేంద్రంగా వెలుగొందిన రామన్నపేట నేడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. గ్రామపంచాయతీ హోదా ఉన్నప్పటికీ మౌలిక వసతుల అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరు విడిచి వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చినప్పుడు దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితులే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
పట్టణంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధాన రహదారిగా ఉన్న సుభాష్ రోడ్ ఇరుకుగా మారడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, భారీ వాహనాలు వచ్చినప్పుడు ద్విచక్ర వాహనదారులు, పాదచారులు పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పార్కింగ్ స్థలాల లేమితో వాహనాలు రోడ్డుపైనే నిలిపివేయడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని పేర్కొన్నారు.
గత పాలకులు రోడ్డు విస్తరణ హామీ ఇచ్చి అసంపూర్తిగా వదిలేశారని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా సమస్య పరిష్కారంపై దృష్టి సారించలేదని విమర్శించారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఎం నాయకులు గాదె నరేందర్, గొరిగే సోములు, ఆముద ఆంజనేయులు, అప్పం సంతోష్, బావండ్లపల్లి సత్యం, తరిగొప్పుల వెంకటరెడ్డి, గంజి అశోక్, పల్లె సత్యం, బోళ్ల వెంకన్న, కుందూరు వెంకటేశ్వర్లు, రాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి