Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:19 AM

విస్తరణ పూర్తి చేయాలి. సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ.

విస్తరణ పూర్తి చేయాలి. సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ.

విస్తరణ పూర్తి చేయాలి.  సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ.
June 08, 2026 02:55 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలోని సుభాష్ సెంటర్ నుంచి మల్లికార్జున రైస్‌మిల్ వరకు రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేసి, పట్టణ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రామన్నపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ మాట్లాడుతూ ఒకప్పుడు తాలూకా, నియోజకవర్గ కేంద్రంగా వెలుగొందిన రామన్నపేట నేడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. గ్రామపంచాయతీ హోదా ఉన్నప్పటికీ మౌలిక వసతుల అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరు విడిచి వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చినప్పుడు దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితులే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

పట్టణంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధాన రహదారిగా ఉన్న సుభాష్ రోడ్ ఇరుకుగా మారడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, భారీ వాహనాలు వచ్చినప్పుడు ద్విచక్ర వాహనదారులు, పాదచారులు పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పార్కింగ్ స్థలాల లేమితో వాహనాలు రోడ్డుపైనే నిలిపివేయడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని పేర్కొన్నారు.

గత పాలకులు రోడ్డు విస్తరణ హామీ ఇచ్చి అసంపూర్తిగా వదిలేశారని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా సమస్య పరిష్కారంపై దృష్టి సారించలేదని విమర్శించారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో సీపీఎం నాయకులు గాదె నరేందర్, గొరిగే సోములు, ఆముద ఆంజనేయులు, అప్పం సంతోష్, బావండ్లపల్లి సత్యం, తరిగొప్పుల వెంకటరెడ్డి, గంజి అశోక్, పల్లె సత్యం, బోళ్ల వెంకన్న, కుందూరు వెంకటేశ్వర్లు, రాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News