Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:03 PM

విస్సన్నపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

విస్సన్నపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

విస్సన్నపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్
January 27, 2026 09:29 PM 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన రిపబ్లిక్ డే దినోత్సవాల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగ స్ఫూర్తి బడుగు బలహీన వర్గాలకు 77 ఏళ్లయినా చేరువు కాలేదని మోడీ పాలనలో ఆదానీ అంబానీలు ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానం సంపాదించగలిగారు కానీ పేదవాడు మరింత పేదవాడుగా మారిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ జెండాను అంగీకరించని ఆర్ఎస్ఎస్ శక్తులు వందేమాతర గీతాన్ని కూడా వివాదం చేశారన్నారు. ఎన్డీఏ పాలనలో భారత రాజ్యాంగాన్ని కూడా మార్చాలని మనువాద రాజ్యాంగం తీసుకురావాలని కన్న పగటి కలలు 2024 ఎన్నికల్లో నెరవేర లేదన్నారు. అంబేద్కర్ చెప్పినట్లు రాజ్యాంగం ఎంత మంచిదైనా అమలు చేసేవారిలో చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం లేదని ఆనాడే చెప్పారని హరినాథ్ గుర్తు చేశారు. రాజ్యాంగం నుండి సామ్యవాదం లౌకిక అంశాలను తొలగించి హిందుత్వ మనువాద అంశాలను జోడించాలని బిజెపి ఎన్ డి ఏ ప్రయత్నిస్తోందని హరినాథ్ ఆరోపించారు. గ్రామీణ పేదలకు జీవనోపాధి కలిగించే మహాత్మా గాంధీ జాతియ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా రూపొందించి రాంజీ పథకంగా మార్పుచేసి కేంద్ర నిధుల్లో కోత పెట్టి రాష్ట్రాల నెత్తిన 40% ఆర్థికభారం వేసిందన్నారు. పబ్లిక్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి దేశంలో నిరుద్యోగం సృష్టించిందని హరినాథ్ అన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ రాజ్యమేలుతోందని, ఉన్నావ్ అత్యాచార రేపిస్టులకు ఫెరోళ్లు మంజూరు చేస్తూ విప్లవకారులను ప్రజాస్వామిక వాదులను ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైలు పాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణకుమారి మౌళి జోషి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News