విస్సన్నపేటలో అతివేగం కారు హల్చల్ – ఇద్దరు అదుపులో
విస్సన్నపేటలో అతివేగం కారు హల్చల్ – ఇద్దరు అదుపులో
GADDAM JAGANMOHAN REDDY
ప్రజల ప్రాణాలకు ముప్పు… సాహసంగా వెంబడించి నిందితుల పట్టివేత
అప్రమత్తమైన పోలీసులు – ప్రమాదకర డ్రైవింగ్కు చెక్
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గ పరిధిలో అతివేగంగా కారు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విస్సన్నపేట మండల పరిధిలో రహదారిపై ఓ కారు ప్రమాదకరంగా దూసుకెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని సమాచారం అందడంతో, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
ఈ క్రమంలో కానిస్టేబుళ్లు షేక్ రియాజ్, నాగేశ్వరావు సాహసోపేతంగా వాహనాన్ని వెంబడించారు. ప్రమాదాన్ని లెక్కచేయకుండా చాకచక్యంగా కారును నిలిపివేసి, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
తదుపరి వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను చూసిన స్థానికులు, రహదారి వెంట ప్రయాణిస్తున్న వాహనదారులు పోలీసుల తక్షణ స్పందనను అభినందించారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి