Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:51 AM

విస్సన్నపేటలో అతివేగం కారు హల్‌చల్ – ఇద్దరు అదుపులో

విస్సన్నపేటలో అతివేగం కారు హల్‌చల్ – ఇద్దరు అదుపులో

విస్సన్నపేటలో అతివేగం కారు హల్‌చల్ – ఇద్దరు అదుపులో
February 22, 2026 07:53 PM 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రజల ప్రాణాలకు ముప్పు… సాహసంగా వెంబడించి నిందితుల పట్టివేత

అప్రమత్తమైన పోలీసులు – ప్రమాదకర డ్రైవింగ్‌కు చెక్

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గ పరిధిలో అతివేగంగా కారు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విస్సన్నపేట మండల పరిధిలో రహదారిపై ఓ కారు ప్రమాదకరంగా దూసుకెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని సమాచారం అందడంతో, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

ఈ క్రమంలో కానిస్టేబుళ్లు షేక్ రియాజ్, నాగేశ్వరావు సాహసోపేతంగా వాహనాన్ని వెంబడించారు. ప్రమాదాన్ని లెక్కచేయకుండా చాకచక్యంగా కారును నిలిపివేసి, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

తదుపరి వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను చూసిన స్థానికులు, రహదారి వెంట ప్రయాణిస్తున్న వాహనదారులు పోలీసుల తక్షణ స్పందనను అభినందించారు.

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News