Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:43 PM

వినియోగదారుల మన్ననలు పొందితేనే వ్యాపార విజయం

వినియోగదారుల మన్ననలు పొందితేనే వ్యాపార విజయం

వినియోగదారుల మన్ననలు పొందితేనే వ్యాపార విజయం
February 18, 2026 08:13 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జాయ్ పెయింట్స్ దుకాణాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ భూక్య జ్యోతి లింగ నాయక్

సూర్యాపేట:

వ్యాపారంలో రాణించాలంటే వినియోగదారుల మన్ననలు పొందడం అత్యంత ముఖ్యమని 4వ వార్డు కౌన్సిలర్ భూక్య జ్యోతి లింగ నాయక్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 18వ వార్డు సుందరయ్య నగర్‌లో జాయ్ పెయింట్స్ దుకాణాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారులకు విశ్వసనీయ సేవలు అందిస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. స్థానిక యువకులు స్వయం ఉపాధి ద్వారా ఎదగడం అభినందనీయమని తెలిపారు.దుకాణ నిర్వాహకులు బానోత్ సురేష్ నాయక్, శ్రవణ్ నాయక్ మాట్లాడుతూ తమ వద్ద గృహాలు, వ్యాపార సముదాయాలు, ఇతర వాణిజ్య సంస్థలకు అవసరమైన అన్ని రకాల రంగులు, పెయింటింగ్ సామగ్రి లభిస్తాయని తెలిపారు. వినియోగదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగేష్, ఉపేందర్, మహేష్, సుధాకర్, పుల్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News