వినియోగదారుల మన్ననలు పొందితేనే వ్యాపార విజయం
వినియోగదారుల మన్ననలు పొందితేనే వ్యాపార విజయం
Biksham
జాయ్ పెయింట్స్ దుకాణాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ భూక్య జ్యోతి లింగ నాయక్
సూర్యాపేట:
వ్యాపారంలో రాణించాలంటే వినియోగదారుల మన్ననలు పొందడం అత్యంత ముఖ్యమని 4వ వార్డు కౌన్సిలర్ భూక్య జ్యోతి లింగ నాయక్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 18వ వార్డు సుందరయ్య నగర్లో జాయ్ పెయింట్స్ దుకాణాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారులకు విశ్వసనీయ సేవలు అందిస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. స్థానిక యువకులు స్వయం ఉపాధి ద్వారా ఎదగడం అభినందనీయమని తెలిపారు.దుకాణ నిర్వాహకులు బానోత్ సురేష్ నాయక్, శ్రవణ్ నాయక్ మాట్లాడుతూ తమ వద్ద గృహాలు, వ్యాపార సముదాయాలు, ఇతర వాణిజ్య సంస్థలకు అవసరమైన అన్ని రకాల రంగులు, పెయింటింగ్ సామగ్రి లభిస్తాయని తెలిపారు. వినియోగదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగేష్, ఉపేందర్, మహేష్, సుధాకర్, పుల్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి