వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకరాచారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ కేంద్రం సమీపంలో శ్రీని మొబైల్ దుకాణాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రైవేట్ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని యువతకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు, నిర్వాహకులు సురేష్, అజయ్, నరేష్, శ్రీకాంత్, మధు, వీరేష్, విజయ్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి