Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:17 AM

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్
07-05-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి:

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలుకు పెంచి, కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే 1 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు, పెద్దకందుకూరు గ్రామాల్లో గురువారం సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ గ్రామాల్లో సదరం సర్టిఫికెట్‌, యూడీఐడీ కార్డులు ఉన్నప్పటికీ గత ఐదేళ్లుగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నామని పలువురు వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రతి వికలాంగ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.

ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ గ్రామాల్లో వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొత్త లలిత, చిన్నకందుకూరు గ్రామ అధ్యక్షుడు ఎర్ర సుధాకర్, కార్యదర్శి ఎర్ర శ్రీనివాసులు, పెద్దకందుకూరు గ్రామ అధ్యక్షుడు కొమ్మగోని రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్

Article Image

యాదాద్రి భువనగిరి:

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలుకు పెంచి, కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే 1 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు, పెద్దకందుకూరు గ్రామాల్లో గురువారం సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ గ్రామాల్లో సదరం సర్టిఫికెట్‌, యూడీఐడీ కార్డులు ఉన్నప్పటికీ గత ఐదేళ్లుగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నామని పలువురు వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రతి వికలాంగ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.

ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ గ్రామాల్లో వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొత్త లలిత, చిన్నకందుకూరు గ్రామ అధ్యక్షుడు ఎర్ర సుధాకర్, కార్యదర్శి ఎర్ర శ్రీనివాసులు, పెద్దకందుకూరు గ్రామ అధ్యక్షుడు కొమ్మగోని రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News