Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:08 AM

వికలాంగుల హక్కుల కోసం శిక్షణా తరగతులు ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర స్థాయి పోస్టర్ ఆవిష్కరణ

వికలాంగుల హక్కుల కోసం శిక్షణా తరగతులు ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర స్థాయి పోస్టర్ ఆవిష్కరణ

వికలాంగుల హక్కుల కోసం శిక్షణా తరగతులు  ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర స్థాయి పోస్టర్ ఆవిష్కరణ
May 19, 2026 03:27 PM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి 31 వరకు యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల పోస్టర్‌ను ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కురునెల్లి వెంకట్ మాట్లాడుతూ.. వికలాంగుల హక్కుల సాధన, వారి సంక్షేమం కోసం నాయకత్వ పటిమను పెంపొందించే లక్ష్యంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వికలాంగుల సమస్యల పరిష్కారం, హక్కుల రక్షణ కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత, నాయకులు పాండాల శ్రీహరి, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News