వికలాంగుల హక్కుల కోసం శిక్షణా తరగతులు ఎన్పీఆర్డీ రాష్ట్ర స్థాయి పోస్టర్ ఆవిష్కరణ
వికలాంగుల హక్కుల కోసం శిక్షణా తరగతులు ఎన్పీఆర్డీ రాష్ట్ర స్థాయి పోస్టర్ ఆవిష్కరణ
Editor Desk
యాదగిరిగుట్ట: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి 31 వరకు యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల పోస్టర్ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు కురునెల్లి వెంకట్ మాట్లాడుతూ.. వికలాంగుల హక్కుల సాధన, వారి సంక్షేమం కోసం నాయకత్వ పటిమను పెంపొందించే లక్ష్యంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వికలాంగుల సమస్యల పరిష్కారం, హక్కుల రక్షణ కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎన్పీఆర్డీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత, నాయకులు పాండాల శ్రీహరి, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి