Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:37 AM

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ అనురాగ్ జయంతి. ఆత్మకూరు పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ అనురాగ్ జయంతి. ఆత్మకూరు పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ అనురాగ్ జయంతి.  ఆత్మకూరు పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్
May 29, 2026 03:55 PM 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రోజువారీ ఓపీకి ఎంతమంది రోగులు వస్తున్నారో, వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పీహెచ్‌సీలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరూ క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నారా లేదా అనే వివరాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని స్పష్టం చేశారు.

ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్, సేవలను మరింత మెరుగుపరచడానికి అవసరమైన ఏర్పాట్లపై వైద్యాధికారులతో చర్చించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

ఈ నెలలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని ప్రసవాలు జరిగాయో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్ని డెలివరీలు నమోదయ్యాయో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో విశ్వాసం పెంచాలని అన్నారు.

షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఎన్‌సీడీ రోగుల ఫాలోఅప్‌పై కూడా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి రోగులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

ప్రతి నెల పీహెచ్‌సీల పనితీరుపై సమీక్ష నిర్వహించి, సిబ్బంది పనితీరుకు రేటింగ్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపైనే ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, వైద్యులు, సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News