Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:36 AM

విధి నిర్వహణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1.35 లక్షల ఆర్థిక భరోసా

విధి నిర్వహణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1.35 లక్షల ఆర్థిక భరోసా

విధి నిర్వహణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1.35 లక్షల ఆర్థిక భరోసా
23-02-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్ చేతుల మీదుగా చెక్కు అందజేత

గోపాలపురంలో విధి నిర్వహణలో ఉండగానే ఆకస్మికంగా మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబానికి పోలీస్ శాఖ ఆర్థిక సహాయం అందించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన డి. మధుసూధన్ గత సంవత్సరం జనవరి 26న అకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణం శాఖకు తీరని లోటుగా అధికారులు పేర్కొన్నారు.

సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ అధికారి కే. ప్రతాప్ శివ కిషోర్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ ఉద్యోగుల సహకార సంఘం ఆధ్వర్యంలో అందవలసిన ప్రయోజనాలను అందిస్తూ రూ.1,35,661 మొత్తానికి చెందిన చెక్కును మధుసూధన్ సతీమణి సంధ్యకు అందించారు.

ఈ మొత్తంలో ఉద్యోగి షేర్ మూలధనం, పొదుపు నిధి జమలు, వాటిపై వచ్చిన వడ్డీ మొత్తం కలిపి చెల్లించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు వివరించారు. చెల్లింపులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, విధి పట్ల నిబద్ధతతో పనిచేసిన పోలీసు సిబ్బంది అకాల మరణం బాధాకరమని తెలిపారు. కుటుంబానికి శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పోలీస్ ఉద్యోగుల సహకార సంఘం ఎల్లప్పుడూ సభ్యుల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో సహకార సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, అకౌంటెంట్ అబ్దుల్ అలీమ్, ఇతర ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Sthanikam

విధి నిర్వహణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1.35 లక్షల ఆర్థిక భరోసా

Article Image

ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్ చేతుల మీదుగా చెక్కు అందజేత

గోపాలపురంలో విధి నిర్వహణలో ఉండగానే ఆకస్మికంగా మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబానికి పోలీస్ శాఖ ఆర్థిక సహాయం అందించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన డి. మధుసూధన్ గత సంవత్సరం జనవరి 26న అకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణం శాఖకు తీరని లోటుగా అధికారులు పేర్కొన్నారు.

సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ అధికారి కే. ప్రతాప్ శివ కిషోర్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ ఉద్యోగుల సహకార సంఘం ఆధ్వర్యంలో అందవలసిన ప్రయోజనాలను అందిస్తూ రూ.1,35,661 మొత్తానికి చెందిన చెక్కును మధుసూధన్ సతీమణి సంధ్యకు అందించారు.

ఈ మొత్తంలో ఉద్యోగి షేర్ మూలధనం, పొదుపు నిధి జమలు, వాటిపై వచ్చిన వడ్డీ మొత్తం కలిపి చెల్లించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు వివరించారు. చెల్లింపులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, విధి పట్ల నిబద్ధతతో పనిచేసిన పోలీసు సిబ్బంది అకాల మరణం బాధాకరమని తెలిపారు. కుటుంబానికి శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పోలీస్ ఉద్యోగుల సహకార సంఘం ఎల్లప్పుడూ సభ్యుల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో సహకార సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, అకౌంటెంట్ అబ్దుల్ అలీమ్, ఇతర ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News