Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:55 AM

వేటకు విరామం.. మత్స్యకారులకు రూ.20 వేల భరోసా

వేటకు విరామం.. మత్స్యకారులకు రూ.20 వేల భరోసా

వేటకు విరామం.. మత్స్యకారులకు రూ.20 వేల భరోసా
May 19, 2026 03:04 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు జమ

కావలిలో సీఎం చంద్రబాబు నిధుల విడుదల

అమరావతి: వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచింది. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులను విడుదల చేశారు.

ప్రతి ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్ర వేట నిషేధం అమల్లో ఉండటంతో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేందుకు కుటుంబానికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. వరుసగా రెండో ఏడాది ఈ సాయం అందించడం విశేషం.

ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. గతేడాది 1.21 లక్షల కుటుంబాలకు రూ.243 కోట్లు, ఈ ఏడాది 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు అందించిందని తెలిపారు. రెండేళ్లలో మొత్తం రూ.505 కోట్ల సాయం చేసినట్లు వెల్లడించారు.

వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం సకాలంలో పరిహారం అందిస్తోందన్నారు. 2024-25లో 63 క్లెయిమ్స్‌కు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 క్లెయిమ్స్‌కు రూ.5.65 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు సీవీడ్ సాగును కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News