వేటకు విరామం.. మత్స్యకారులకు రూ.20 వేల భరోసా
వేటకు విరామం.. మత్స్యకారులకు రూ.20 వేల భరోసా
Editor Desk
1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు జమ
కావలిలో సీఎం చంద్రబాబు నిధుల విడుదల
అమరావతి: వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచింది. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులను విడుదల చేశారు.
ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్ర వేట నిషేధం అమల్లో ఉండటంతో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేందుకు కుటుంబానికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. వరుసగా రెండో ఏడాది ఈ సాయం అందించడం విశేషం.
ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. గతేడాది 1.21 లక్షల కుటుంబాలకు రూ.243 కోట్లు, ఈ ఏడాది 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు అందించిందని తెలిపారు. రెండేళ్లలో మొత్తం రూ.505 కోట్ల సాయం చేసినట్లు వెల్లడించారు.
వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం సకాలంలో పరిహారం అందిస్తోందన్నారు. 2024-25లో 63 క్లెయిమ్స్కు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 క్లెయిమ్స్కు రూ.5.65 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు సీవీడ్ సాగును కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి