Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:36 PM

వేటకు విరామం.. మత్స్యకారులకు రూ.20 వేల భరోసా

వేటకు విరామం.. మత్స్యకారులకు రూ.20 వేల భరోసా

వేటకు విరామం.. మత్స్యకారులకు రూ.20 వేల భరోసా
May 19, 2026 03:04 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు జమ

కావలిలో సీఎం చంద్రబాబు నిధుల విడుదల

అమరావతి: వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచింది. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులను విడుదల చేశారు.

ప్రతి ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్ర వేట నిషేధం అమల్లో ఉండటంతో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేందుకు కుటుంబానికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. వరుసగా రెండో ఏడాది ఈ సాయం అందించడం విశేషం.

ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. గతేడాది 1.21 లక్షల కుటుంబాలకు రూ.243 కోట్లు, ఈ ఏడాది 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు అందించిందని తెలిపారు. రెండేళ్లలో మొత్తం రూ.505 కోట్ల సాయం చేసినట్లు వెల్లడించారు.

వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం సకాలంలో పరిహారం అందిస్తోందన్నారు. 2024-25లో 63 క్లెయిమ్స్‌కు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 క్లెయిమ్స్‌కు రూ.5.65 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు సీవీడ్ సాగును కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News