Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:34 AM

వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్

వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్

వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్
February 19, 2026 06:11 AM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి : రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని జంగారెడ్డిగూడెం మరియు చింతలపూడి మున్సిపాలిటీల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు.

బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (AP CRDA) కార్యాలయంలో మున్సిపల్ డైరెక్టర్ సంపత్ కుమార్ ను కలసి పలు అంశాలపై చర్చించారు.

రెండు మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్యం, మురుగు మరియు నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వర్షాకాలం, వేసవి కాలాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.



అదేవిధంగా చింతలపూడి నగర పంచాయతీలో వార్డు సచివాలయ సిబ్బంది కేటాయింపుల విషయంలో స్పష్టత తీసుకువచ్చి, అవసరమైన సిబ్బందిని నియమించి ప్రజలకు సేవలు వేగవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా తీసుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News