వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్
వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్
GADDAM JAGANMOHAN REDDY
చింతలపూడి : రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని జంగారెడ్డిగూడెం మరియు చింతలపూడి మున్సిపాలిటీల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు.
బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (AP CRDA) కార్యాలయంలో మున్సిపల్ డైరెక్టర్ సంపత్ కుమార్ ను కలసి పలు అంశాలపై చర్చించారు.
రెండు మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్యం, మురుగు మరియు నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వర్షాకాలం, వేసవి కాలాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా చింతలపూడి నగర పంచాయతీలో వార్డు సచివాలయ సిబ్బంది కేటాయింపుల విషయంలో స్పష్టత తీసుకువచ్చి, అవసరమైన సిబ్బందిని నియమించి ప్రజలకు సేవలు వేగవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా తీసుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి