Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:53 PM

వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక

వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక

వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక
March 31, 2026 09:02 PM 231 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇళ్లకు తాళాలు వేయకపోతే ప్రమాదం ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచన


చౌటుప్పల్ మండల పరిధిలోని పట్టణ, గ్రామాల ప్రజలకు స్థానిక పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వేసవి కాలంలో చాలా మంది ప్రజలు ఇళ్ల డాబాలపై లేదా ఆరుబయట వరండాల్లో నిద్రిస్తున్న నేపథ్యంలో దొంగలు దీనిని అవకాశంగా తీసుకుని ఇండ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.ఇళ్లకు తాళాలు వేయకుండా కేవలం తలుపులు మూసి నిద్రించడం వల్ల బంగారం, వెండి, నగదు వంటి విలువైన వస్తువులు దొంగిలించబడుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు బయట నిద్రిస్తున్న వ్యక్తుల మెడలోని బంగారు గొలుసులు, ఇతర ఆభరణాలు కూడా దోచుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. శుభకార్యాల కోసం లేదా బంధువుల ఇళ్లకు వెళ్లే వారు కూడా తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత వరకు ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

అలాగే గ్రామాలు, కాలనీలలోని ఇళ్లతో పాటు చిన్న, పెద్ద దుకాణాలు, సంస్థలు కూడా తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం పరిశీలించాలని సీ ఐ మన్మధ కుమార్ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News