Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక

వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక

వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక
31-03-2026 241 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇళ్లకు తాళాలు వేయకపోతే ప్రమాదం ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచన


చౌటుప్పల్ మండల పరిధిలోని పట్టణ, గ్రామాల ప్రజలకు స్థానిక పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వేసవి కాలంలో చాలా మంది ప్రజలు ఇళ్ల డాబాలపై లేదా ఆరుబయట వరండాల్లో నిద్రిస్తున్న నేపథ్యంలో దొంగలు దీనిని అవకాశంగా తీసుకుని ఇండ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.ఇళ్లకు తాళాలు వేయకుండా కేవలం తలుపులు మూసి నిద్రించడం వల్ల బంగారం, వెండి, నగదు వంటి విలువైన వస్తువులు దొంగిలించబడుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు బయట నిద్రిస్తున్న వ్యక్తుల మెడలోని బంగారు గొలుసులు, ఇతర ఆభరణాలు కూడా దోచుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. శుభకార్యాల కోసం లేదా బంధువుల ఇళ్లకు వెళ్లే వారు కూడా తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత వరకు ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

అలాగే గ్రామాలు, కాలనీలలోని ఇళ్లతో పాటు చిన్న, పెద్ద దుకాణాలు, సంస్థలు కూడా తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం పరిశీలించాలని సీ ఐ మన్మధ కుమార్ సూచించారు.

Sthanikam

వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక

Article Image

ఇళ్లకు తాళాలు వేయకపోతే ప్రమాదం ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచన


చౌటుప్పల్ మండల పరిధిలోని పట్టణ, గ్రామాల ప్రజలకు స్థానిక పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వేసవి కాలంలో చాలా మంది ప్రజలు ఇళ్ల డాబాలపై లేదా ఆరుబయట వరండాల్లో నిద్రిస్తున్న నేపథ్యంలో దొంగలు దీనిని అవకాశంగా తీసుకుని ఇండ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.ఇళ్లకు తాళాలు వేయకుండా కేవలం తలుపులు మూసి నిద్రించడం వల్ల బంగారం, వెండి, నగదు వంటి విలువైన వస్తువులు దొంగిలించబడుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు బయట నిద్రిస్తున్న వ్యక్తుల మెడలోని బంగారు గొలుసులు, ఇతర ఆభరణాలు కూడా దోచుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. శుభకార్యాల కోసం లేదా బంధువుల ఇళ్లకు వెళ్లే వారు కూడా తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత వరకు ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

అలాగే గ్రామాలు, కాలనీలలోని ఇళ్లతో పాటు చిన్న, పెద్ద దుకాణాలు, సంస్థలు కూడా తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం పరిశీలించాలని సీ ఐ మన్మధ కుమార్ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News