వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక
వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక
K.RAVI
ఇళ్లకు తాళాలు వేయకపోతే ప్రమాదం ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచన
చౌటుప్పల్ మండల పరిధిలోని పట్టణ, గ్రామాల ప్రజలకు స్థానిక పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వేసవి కాలంలో చాలా మంది ప్రజలు ఇళ్ల డాబాలపై లేదా ఆరుబయట వరండాల్లో నిద్రిస్తున్న నేపథ్యంలో దొంగలు దీనిని అవకాశంగా తీసుకుని ఇండ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.ఇళ్లకు తాళాలు వేయకుండా కేవలం తలుపులు మూసి నిద్రించడం వల్ల బంగారం, వెండి, నగదు వంటి విలువైన వస్తువులు దొంగిలించబడుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు బయట నిద్రిస్తున్న వ్యక్తుల మెడలోని బంగారు గొలుసులు, ఇతర ఆభరణాలు కూడా దోచుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. శుభకార్యాల కోసం లేదా బంధువుల ఇళ్లకు వెళ్లే వారు కూడా తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత వరకు ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
అలాగే గ్రామాలు, కాలనీలలోని ఇళ్లతో పాటు చిన్న, పెద్ద దుకాణాలు, సంస్థలు కూడా తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం పరిశీలించాలని సీ ఐ మన్మధ కుమార్ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి