Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత వెంకటేశం గౌడ్ బర్త్‌డే వేడుకలు చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 31, 2026 11:04 PM

వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక

వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక

వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక
March 31, 2026 09:02 PM 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇళ్లకు తాళాలు వేయకపోతే ప్రమాదం ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచన


చౌటుప్పల్ మండల పరిధిలోని పట్టణ, గ్రామాల ప్రజలకు స్థానిక పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వేసవి కాలంలో చాలా మంది ప్రజలు ఇళ్ల డాబాలపై లేదా ఆరుబయట వరండాల్లో నిద్రిస్తున్న నేపథ్యంలో దొంగలు దీనిని అవకాశంగా తీసుకుని ఇండ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.ఇళ్లకు తాళాలు వేయకుండా కేవలం తలుపులు మూసి నిద్రించడం వల్ల బంగారం, వెండి, నగదు వంటి విలువైన వస్తువులు దొంగిలించబడుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు బయట నిద్రిస్తున్న వ్యక్తుల మెడలోని బంగారు గొలుసులు, ఇతర ఆభరణాలు కూడా దోచుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. శుభకార్యాల కోసం లేదా బంధువుల ఇళ్లకు వెళ్లే వారు కూడా తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత వరకు ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

అలాగే గ్రామాలు, కాలనీలలోని ఇళ్లతో పాటు చిన్న, పెద్ద దుకాణాలు, సంస్థలు కూడా తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం పరిశీలించాలని సీ ఐ మన్మధ కుమార్ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News