Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐఏసీఈ చరిత్ర సృష్టించింది గ్రాండ్ సక్సెస్ మీట్‌లో చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రావు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ పుట్టపర్తి లో యుద్దావిమానాల తయారీ కేంద్రానికి భూమిపూజ చేయనున్న సీఎం బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 10:58 PM

వేసవి లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్

వేసవి లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్

వేసవి లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్
May 09, 2026 09:27 PM 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి,కలెక్టరేట్ లోని మినీ కన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామస్థాయిలో ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. RWS అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక సూచనలు చేశారు.RWS One App, వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్ రిపోర్టులను ప్రతిరోజూ అప్డేట్ చేస్తూ, గ్రామాల వారీగా నీటి సరఫరాను పర్యవేక్షించాలి.నీటి కొరత ఉన్న చోట వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, అవసరమైతే ప్రైవేట్ బోర్లను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో పైపులైన్లు, మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. నీటి నమూనాలను పరీక్షించి, క్లోరినేషన్ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలి.జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని, జిల్లాలో నిర్మాణంలో ఉన్న 271 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు."నీటి సమస్యల విషయంలో రాజీ పడకూడదు, ప్రజలకు కనీసం 55 LPCD నీరు అందేలా చూడాలి" అని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమం లో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ మురళీధర్,గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, ఇంజినీర్లు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News