Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:16 AM

వేసవి లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్

వేసవి లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్

వేసవి లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్
09-05-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి,కలెక్టరేట్ లోని మినీ కన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామస్థాయిలో ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. RWS అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక సూచనలు చేశారు.RWS One App, వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్ రిపోర్టులను ప్రతిరోజూ అప్డేట్ చేస్తూ, గ్రామాల వారీగా నీటి సరఫరాను పర్యవేక్షించాలి.నీటి కొరత ఉన్న చోట వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, అవసరమైతే ప్రైవేట్ బోర్లను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో పైపులైన్లు, మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. నీటి నమూనాలను పరీక్షించి, క్లోరినేషన్ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలి.జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని, జిల్లాలో నిర్మాణంలో ఉన్న 271 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు."నీటి సమస్యల విషయంలో రాజీ పడకూడదు, ప్రజలకు కనీసం 55 LPCD నీరు అందేలా చూడాలి" అని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమం లో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ మురళీధర్,గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, ఇంజినీర్లు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

వేసవి లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్

Article Image

పుట్టపర్తి,కలెక్టరేట్ లోని మినీ కన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామస్థాయిలో ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. RWS అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక సూచనలు చేశారు.RWS One App, వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్ రిపోర్టులను ప్రతిరోజూ అప్డేట్ చేస్తూ, గ్రామాల వారీగా నీటి సరఫరాను పర్యవేక్షించాలి.నీటి కొరత ఉన్న చోట వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, అవసరమైతే ప్రైవేట్ బోర్లను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో పైపులైన్లు, మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. నీటి నమూనాలను పరీక్షించి, క్లోరినేషన్ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలి.జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని, జిల్లాలో నిర్మాణంలో ఉన్న 271 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు."నీటి సమస్యల విషయంలో రాజీ పడకూడదు, ప్రజలకు కనీసం 55 LPCD నీరు అందేలా చూడాలి" అని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమం లో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ మురళీధర్,గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, ఇంజినీర్లు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News