వేసవి లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్
వేసవి లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్
Anjali
పుట్టపర్తి,కలెక్టరేట్ లోని మినీ కన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామస్థాయిలో ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. RWS అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక సూచనలు చేశారు.RWS One App, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ రిపోర్టులను ప్రతిరోజూ అప్డేట్ చేస్తూ, గ్రామాల వారీగా నీటి సరఫరాను పర్యవేక్షించాలి.నీటి కొరత ఉన్న చోట వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, అవసరమైతే ప్రైవేట్ బోర్లను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో పైపులైన్లు, మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. నీటి నమూనాలను పరీక్షించి, క్లోరినేషన్ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలి.జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని, జిల్లాలో నిర్మాణంలో ఉన్న 271 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు."నీటి సమస్యల విషయంలో రాజీ పడకూడదు, ప్రజలకు కనీసం 55 LPCD నీరు అందేలా చూడాలి" అని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమం లో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ మురళీధర్,గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, ఇంజినీర్లు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి