PRINT TIME: April 10, 2026 01:36 AM
వీరసైనీకులు నిత్య ప్రేరణ దాయకం
వీరసైనీకులు నిత్య ప్రేరణ దాయకం
February 14, 2026 08:54 PM
111 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
పుల్వామా దాడిలో రక్తసిక్తమై అసువులు బాసిన వీర జవాన్ల ఆశయాలు నేటి తరానికి నిత్య ప్రేరణదాయకమని బజరంగ్దళ్ జిల్లా కో కన్వీనర్ గోగు రవి అన్నారు.చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర జవాన్ల దివాస్ కార్యక్రమం నిర్వహించారు.
దేశరక్షణలో అసువులు బాసిన వీర జవాన్లకు స్మరిస్తూ స్థానిక రామాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ వెళ్లి అమరులైన వీర సైనీకుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా కో కన్వినర్ గోగు రవి, నగర కన్వీనర్ చింతల హేమంత్, నగర గోరక్ష ప్రముఖ్ గుండెబోయిన వివేక్, నాగేల్లి సందీప్,ఈమ్మడి ఈశ్వర్, బొబ్బిళ్ల సాయి, నరేష్ బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి