వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
Komidala Mahender reddy
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల లింగస్వామి , దమ్మాల నరేందర్ రెడ్డి, మునుగోటి మహేష్, వెంకన్న, మచ్చగిరి, మథు, రవీంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రమణమ్మ, పుష్పమ్మ, అండాలు, ఉప్పమ్మ, శంకరమ్మ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు.అదేవిధంగా చిట్యాల మున్సిపాలిటీకి చెందిన గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు అందిస్తామని ప్రకటించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి