వెలుగుమట్ల భూములు పేదలకే కేటాయించాలి
వెలుగుమట్ల భూములు పేదలకే కేటాయించాలి
Biksham Goud
ఇళ్ల కూల్చివేతలు నిలిపివేసి పోలీసులు, అధికారులు వెనక్కి వెళ్లాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డిమాండ్
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల పార్కు పరిసర ప్రాంతాల్లో గత 15 సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలను బలవంతంగా బయటకు పంపించడం, వారి ఇళ్లను కూల్చివేయడం అమానుష చర్య అని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండించింది.
ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతోందో చెప్పాలని ప్రశ్నించారు.
ఏళ్ల తరబడి అక్కడ గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు భూములు కేటాయించి హక్కులు ఇవ్వాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు పోలీసు బలగాలను అడ్డంగా పెట్టుకుని ఇళ్లను కూల్చడం అన్యాయమని అన్నారు. పేదల పక్షాన నిలబడి సంఘీభావం తెలిపిన కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే ఇళ్ల కూల్చివేతలను నిలిపివేసి, అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు గృహ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసు బలగాలు, ప్రభుత్వ అధికారులు ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లి పేదలకు రక్షణ కల్పించాలని కోరారు. లేదంటే ప్రజా వ్యతిరేక చర్యలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి