వెలిమినేడులో ఘనంగా కైట్ ఫెస్టివల్
వెలిమినేడులో ఘనంగా కైట్ ఫెస్టివల్
Komidala Mahender reddy
చిట్యాల స్థానికరం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలిమినేడు, బోంగోని చెరువు, పిట్టంపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని గ్రామీణ క్రీడలతో పాటు గాలిపటాల ఎగరవేత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంగుని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, పిటంపల్లి సర్పంచ్ అందే అండాలు రాములు, ఉప సర్పంచ్ లో సామిడి సాయి కృష్ణారెడ్డి, నారగోని నాగరాజు యాదవ్, సత్తిరెడ్డి, మహేందర్ రెడ్డి, పాల సంఘం చైర్మన్ మారగోని యాదయ్య, సుధాకర్, శ్రీశైలం, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు..
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి