చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మంగళవారం జరిగిన సిపిఎం గ్రామ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యుద్ధ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, గ్యాస్ సరఫరాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధ నివారణకు చర్యలు తీసుకోవాల్సిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు తగవని అన్నారు.
కేరళ ప్రభుత్వం విద్య, వైద్యం, పేదరిక నిర్మూలనలో ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంటూ, ఇక్కడ కూడా హామీల అమలులో చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ, లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. నెలికంటి నర్సింహా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిట్ట నగేష్, మల్లం మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి