Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఎడిటర్ శ్రీ కొండా మల్లేశం గౌడ్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు! జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 05:30 PM

వెలిమినేడు సిపిఎం సమావేశం: ధరల పెరుగుదలపై వీరారెడ్డి ఆందోళన

వెలిమినేడు సిపిఎం సమావేశం: ధరల పెరుగుదలపై వీరారెడ్డి ఆందోళన

వెలిమినేడు సిపిఎం సమావేశం: ధరల పెరుగుదలపై వీరారెడ్డి ఆందోళన
April 07, 2026 04:03 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మంగళవారం జరిగిన సిపిఎం గ్రామ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యుద్ధ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, గ్యాస్ సరఫరాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధ నివారణకు చర్యలు తీసుకోవాల్సిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు తగవని అన్నారు.

కేరళ ప్రభుత్వం విద్య, వైద్యం, పేదరిక నిర్మూలనలో ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంటూ, ఇక్కడ కూడా హామీల అమలులో చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ, లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. నెలికంటి నర్సింహా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిట్ట నగేష్, మల్లం మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News