Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:43 AM

వెలిమినేడు సిపిఎం సమావేశం: ధరల పెరుగుదలపై వీరారెడ్డి ఆందోళన

వెలిమినేడు సిపిఎం సమావేశం: ధరల పెరుగుదలపై వీరారెడ్డి ఆందోళన

వెలిమినేడు సిపిఎం సమావేశం: ధరల పెరుగుదలపై వీరారెడ్డి ఆందోళన
07-04-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మంగళవారం జరిగిన సిపిఎం గ్రామ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యుద్ధ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, గ్యాస్ సరఫరాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధ నివారణకు చర్యలు తీసుకోవాల్సిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు తగవని అన్నారు.

కేరళ ప్రభుత్వం విద్య, వైద్యం, పేదరిక నిర్మూలనలో ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంటూ, ఇక్కడ కూడా హామీల అమలులో చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ, లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. నెలికంటి నర్సింహా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిట్ట నగేష్, మల్లం మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

వెలిమినేడు సిపిఎం సమావేశం: ధరల పెరుగుదలపై వీరారెడ్డి ఆందోళన

Article Image

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మంగళవారం జరిగిన సిపిఎం గ్రామ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యుద్ధ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, గ్యాస్ సరఫరాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధ నివారణకు చర్యలు తీసుకోవాల్సిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు తగవని అన్నారు.

కేరళ ప్రభుత్వం విద్య, వైద్యం, పేదరిక నిర్మూలనలో ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంటూ, ఇక్కడ కూడా హామీల అమలులో చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ, లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. నెలికంటి నర్సింహా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిట్ట నగేష్, మల్లం మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News