వెలిమినేడు నొష్ ల్యాబ్స్ ముందు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా
వెలిమినేడు నొష్ ల్యాబ్స్ ముందు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్దగల నొష్ ల్యాబ్స్ లో జరిగిన విషాదకర ప్రమాదం ఉద్రిక్తతకు దారి తీసింది. నిన్న చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు ధర్నాకు దిగారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. సంస్థ చుట్టూ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం ద్వారా బాధితుల సమస్యలను దాటవేయాలని యాజమాన్యం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
మృతుడి కుటుంబానికి కనీసం ఒక కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం స్పందించి బాధ్యత వహించాలని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, సంఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి