Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:31 AM

వెలిమినేడు నొష్ ల్యాబ్స్ ముందు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా

వెలిమినేడు నొష్ ల్యాబ్స్ ముందు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా

వెలిమినేడు నొష్ ల్యాబ్స్ ముందు  ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా
02-05-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్దగల నొష్ ల్యాబ్స్ లో జరిగిన విషాదకర ప్రమాదం ఉద్రిక్తతకు దారి తీసింది. నిన్న చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు ధర్నాకు దిగారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. సంస్థ చుట్టూ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం ద్వారా బాధితుల సమస్యలను దాటవేయాలని యాజమాన్యం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

మృతుడి కుటుంబానికి కనీసం ఒక కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం స్పందించి బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, సంఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

Sthanikam

వెలిమినేడు నొష్ ల్యాబ్స్ ముందు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్దగల నొష్ ల్యాబ్స్ లో జరిగిన విషాదకర ప్రమాదం ఉద్రిక్తతకు దారి తీసింది. నిన్న చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు ధర్నాకు దిగారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. సంస్థ చుట్టూ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం ద్వారా బాధితుల సమస్యలను దాటవేయాలని యాజమాన్యం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

మృతుడి కుటుంబానికి కనీసం ఒక కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం స్పందించి బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, సంఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News