Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 07:02 AM

వెలిమినేడు నొష్ ల్యాబ్స్ ముందు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా

వెలిమినేడు నొష్ ల్యాబ్స్ ముందు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా

వెలిమినేడు నొష్ ల్యాబ్స్ ముందు  ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా
May 02, 2026 02:29 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్దగల నొష్ ల్యాబ్స్ లో జరిగిన విషాదకర ప్రమాదం ఉద్రిక్తతకు దారి తీసింది. నిన్న చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు ధర్నాకు దిగారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. సంస్థ చుట్టూ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం ద్వారా బాధితుల సమస్యలను దాటవేయాలని యాజమాన్యం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

మృతుడి కుటుంబానికి కనీసం ఒక కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం స్పందించి బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, సంఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News