Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:13 AM

వెల్లంకిలో విషాదం.. బాధిత కుటుంబాలకు సహాయం

వెల్లంకిలో విషాదం.. బాధిత కుటుంబాలకు సహాయం

వెల్లంకిలో విషాదం.. బాధిత కుటుంబాలకు సహాయం
02-05-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పద్మశాలి కుటుంబాల వారు ఈపూరి సత్యనారాయణ, మిర్యాల బాలరాజు అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, కొండా లక్ష్మణ్ బాపూజీ సేవా సంస్థ చైర్మన్ బర్రింకల మధుసూదన్‌లకు సమాచారం అందించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి పిల్లలకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించాలని కోరారు.

దీనికి స్పందించిన సంఘం నాయకులు బాధిత కుటుంబాలైన ఈపూరి సునీత, మిర్యాల అంజలి వారికి రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి పిల్లలకు భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ విషయమై చొరవ చూపిన అఖిలభారత పద్మశాలి సంఘం వర్కింగ్ కమిటీ సభ్యులు ఇడం శ్రీనివాస్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

వెల్లంకిలో విషాదం.. బాధిత కుటుంబాలకు సహాయం

Article Image

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పద్మశాలి కుటుంబాల వారు ఈపూరి సత్యనారాయణ, మిర్యాల బాలరాజు అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, కొండా లక్ష్మణ్ బాపూజీ సేవా సంస్థ చైర్మన్ బర్రింకల మధుసూదన్‌లకు సమాచారం అందించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి పిల్లలకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించాలని కోరారు.

దీనికి స్పందించిన సంఘం నాయకులు బాధిత కుటుంబాలైన ఈపూరి సునీత, మిర్యాల అంజలి వారికి రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి పిల్లలకు భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ విషయమై చొరవ చూపిన అఖిలభారత పద్మశాలి సంఘం వర్కింగ్ కమిటీ సభ్యులు ఇడం శ్రీనివాస్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News