వెల్లంకిలో విషాదం.. బాధిత కుటుంబాలకు సహాయం
వెల్లంకిలో విషాదం.. బాధిత కుటుంబాలకు సహాయం
Editor Desk
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పద్మశాలి కుటుంబాల వారు ఈపూరి సత్యనారాయణ, మిర్యాల బాలరాజు అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై స్పందించిన గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, కొండా లక్ష్మణ్ బాపూజీ సేవా సంస్థ చైర్మన్ బర్రింకల మధుసూదన్లకు సమాచారం అందించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి పిల్లలకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించాలని కోరారు.
దీనికి స్పందించిన సంఘం నాయకులు బాధిత కుటుంబాలైన ఈపూరి సునీత, మిర్యాల అంజలి వారికి రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి పిల్లలకు భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ విషయమై చొరవ చూపిన అఖిలభారత పద్మశాలి సంఘం వర్కింగ్ కమిటీ సభ్యులు ఇడం శ్రీనివాస్కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి