Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ: నర్సింహ బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 08:57 AM

వెల్లంకిలో విషాదం.. బాధిత కుటుంబాలకు సహాయం

వెల్లంకిలో విషాదం.. బాధిత కుటుంబాలకు సహాయం

వెల్లంకిలో విషాదం.. బాధిత కుటుంబాలకు సహాయం
May 02, 2026 07:15 AM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పద్మశాలి కుటుంబాల వారు ఈపూరి సత్యనారాయణ, మిర్యాల బాలరాజు అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, కొండా లక్ష్మణ్ బాపూజీ సేవా సంస్థ చైర్మన్ బర్రింకల మధుసూదన్‌లకు సమాచారం అందించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి పిల్లలకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించాలని కోరారు.

దీనికి స్పందించిన సంఘం నాయకులు బాధిత కుటుంబాలైన ఈపూరి సునీత, మిర్యాల అంజలి వారికి రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి పిల్లలకు భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ విషయమై చొరవ చూపిన అఖిలభారత పద్మశాలి సంఘం వర్కింగ్ కమిటీ సభ్యులు ఇడం శ్రీనివాస్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News