రామన్నపేట: మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం హనుమాన్ జయంతోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్టులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం తమలపాకుల మాలలు, వడమాలలు, పూలమాలలతో ప్రత్యేక అలంకరణ చేశారు. మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో హోమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు.
అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి, మడూరి ప్రభాకర్రావు, తాటిపాముల జంగయ్య, స్వామి, ఎడ్ల నరేందర్రెడ్డి, దేప భాస్కర్రెడ్డి, పోచబోయిన నర్సింహ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి