Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:54 AM

వెంకటయ్య అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు

వెంకటయ్య అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు

వెంకటయ్య అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు
January 17, 2026 07:12 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:మహబూబాబాద్ జిల్లా గాంధీపురం గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో ఈ నెల 05వ తేదీ జనవరి నాడు మరణించిన గుండ మాల వెంకటయ్య కుటుంబాన్ని మదర్ తెరిసా విద్యాభ్యాస కళాశాల ఉపాధ్యాయులు పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఎన్నో సంవత్సరాలుగా అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా, అంకితభావంతో సేవలు అందించిన వెంకటయ్య మరణం అత్యంత బాధాకరమని మానవ హక్కులు, సామాజిక న్యాయం, సామాజిక సేవ మార్పు కోసం పనిచేస్తున్న సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, వెంకటయ్య నిరాడంబరమైన జీవితం గడుపుతూ, తన విధుల పట్ల నిబద్ధతతో అందరి అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి అకాల మరణం యాజమాన్యానికి, సహోద్యోగులకు, గ్రామ ప్రజలకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.ఎన్నో సంవత్సరాలుగా అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా, అంకితభావంతో సేవలు అందించిన వెంకటయ్య మరణం అత్యంత బాధాకరమని మానవ హక్కులు,సామాజిక న్యాయం,సామాజిక సేవ మార్పు కోసం పనిచేస్తున్న సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ అన్నారు.ఆయన మాట్లాడుతూ, వెంకటయ్య నిరాడంబరమైన జీవితం గడుపుతూ, తన విధుల పట్ల నిబద్ధతతో అందరి అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి అకాల మరణం యాజమాన్యానికి, సహోద్యోగులకు, గ్రామ ప్రజలకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.కే. వీరయ్య, వీరభద్రం, జైపాల్ రెడ్డి, రాజేష్, కవిత, భిక్షం తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే వెంకటయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News