ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
:నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మండలం, రుద్రారం గ్రామానికి చెందిన వెంకట్రావు పటేల్ ఇటీవల పరమపదించిన విషయం తెలిసిన వెంటనే ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు నాగేష్ షేట్కార్ ఈరోజు వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుని కుమారుడు వినోద్ పటేల్ను కలుసుకుని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ఖేడ్ నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు సాయిలు పటేల్, పండు, నాగేష్ యాదవ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి