PRINT TIME: April 10, 2026 02:05 PM
వెంకటాపురంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం
వెంకటాపురంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం
April 10, 2026 12:11 PM
6 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
వెంకటాపురం గ్రామ రైతులకు శుభవార్తగా నూతన వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. నకిరేకల్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ కేంద్రం గ్రామానికి మంజూరు చేయబడింది.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జెర్రి పోతుల సత్యనారాయణ ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఈ కేంద్రం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్రామానికి ఈ కేంద్రం అందుబాటులోకి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి