వీధిలైట్లతో మొదలు… అభివృద్ధికి బాట
వీధిలైట్లతో మొదలు… అభివృద్ధికి బాట
Editor Desk
– వార్డు సభ్యుడు మేడి హరికృష్ణ
చిట్యాల స్థానికం ప్రతినిది ప్రశాంత్
వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని వట్టిమర్తి గ్రామ 8వ వార్డు సభ్యుడు మేడి హరికృష్ణ అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని 8వ వార్డులో గత కొద్ది రోజులుగా వీధిలైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈ విషయంపై వెంటనే స్పందించిన హరికృష్ణ సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వీధిలైట్లను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్డులో వీధిలైట్ల సమస్యతో పాటు పారిశుద్ధ్య లోపాలు, తాగునీటి ఇబ్బందులు, సీసీ రోడ్ల సమస్యలు వంటి మౌలిక సదుపాయాల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు.ప్రజల సహకారంతో వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి