Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండ్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 08:10 PM

వీధిలైట్లతో మొదలు… అభివృద్ధికి బాట

వీధిలైట్లతో మొదలు… అభివృద్ధికి బాట

వీధిలైట్లతో మొదలు… అభివృద్ధికి బాట
January 13, 2026 07:28 PM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

– వార్డు సభ్యుడు మేడి హరికృష్ణ

చిట్యాల స్థానికం ప్రతినిది ప్రశాంత్

వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని వట్టిమర్తి గ్రామ 8వ వార్డు సభ్యుడు మేడి హరికృష్ణ అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని 8వ వార్డులో గత కొద్ది రోజులుగా వీధిలైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ఈ విషయంపై వెంటనే స్పందించిన హరికృష్ణ సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వీధిలైట్లను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్డులో వీధిలైట్ల సమస్యతో పాటు పారిశుద్ధ్య లోపాలు, తాగునీటి ఇబ్బందులు, సీసీ రోడ్ల సమస్యలు వంటి మౌలిక సదుపాయాల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు.ప్రజల సహకారంతో వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News