యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి
యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి
K.RAVI
రైస్ డిపోను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
యువత, నిరుద్యోగులు కేవలం ఉద్యోగాల కోసమే వేచి చూడకుండా, స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో చింతకింది గణేష్ ఏర్పాటు చేసిన 'శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్' రైస్ డిపోను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. యువకులు సమయాన్ని వృధా చేసుకోకుండా సొంతంగా వ్యాపార, ఉపాధి రంగాలను ఎంచుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా తాము ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, మరో నలుగురికి జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదగడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం రైస్ డిపో నిర్వాహకులు అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, షాదీఖానా చైర్మన్ ఎండి కరీం, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోర్పునూరి నరసింహ గౌడ్, ఎజాస్ పాషా, వెంకటేష్, సాయి, సంతోష్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి