గొట్టిపర్తిలో ఏకలవ్య విగ్ర ఆవిష్కరణ చేసిన; ఎమ్మెల్యే మందుల సామేల్
గొట్టిపర్తిలో ఏకలవ్య విగ్ర ఆవిష్కరణ చేసిన; ఎమ్మెల్యే మందుల సామేల్
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఆదివారం నాడు ఎరుకలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏకలవ్య విగ్ర ప్రతిష్ట మహోత్సవాo నిర్మించడం జరిగింది. మహోత్సవానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్, రాష్ట్ర నాయకుడు ఏపూరి సోమన్న పాల్గొని ఏకలవ్య విగ్రహ ఆవిష్కరణ చేశారు. ముందుగా ఎమ్మెల్యే సామేలుకు ఎరుకలి సంఘం మహిళలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముందుగా ఏకలవ్య విగ్రహాన్ని గ్రామాల్లో ప్రతిష్టించడం ఎరుకలి సంఘం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా వారు ఏకలవ్య మహాభారతంలోని అత్యున్నత గురుభక్తికి అంకూలిత దీక్షకు ప్రతీక అని అన్నారు. నిషాద తెగకు చెందిన వారు అని, ఏకలవ్య గురువు ద్రోణాచార్యుని మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిoచి స్వయంకృషితో అర్జునుడికి సమనమైన విలువిద్యను అభ్యసించాడని గురుదక్షిణగా తన కుడిచేతి బొటనవేలను అడిగినప్పుడు సందేహించకుండా సమర్పించి త్యాగనిరతికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడని అన్నారు. ఎరుకల వారి సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చట్టసభలో ఎరుకలి కులవృత్తులను గురించి వివరించి వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, ఉపసర్పంచ్ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, జనార్ధన్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, ఏకలవ్య యూత్ సభ్యులు,గ్రామస్తులు, పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి