Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:02 AM

గొట్టిపర్తిలో ఏకలవ్య విగ్ర ఆవిష్కరణ చేసిన; ఎమ్మెల్యే మందుల సామేల్

గొట్టిపర్తిలో ఏకలవ్య విగ్ర ఆవిష్కరణ చేసిన; ఎమ్మెల్యే మందుల సామేల్

గొట్టిపర్తిలో ఏకలవ్య విగ్ర ఆవిష్కరణ చేసిన;   ఎమ్మెల్యే మందుల సామేల్
April 12, 2026 07:10 PM 356 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఆదివారం నాడు ఎరుకలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏకలవ్య విగ్ర ప్రతిష్ట మహోత్సవాo నిర్మించడం జరిగింది. మహోత్సవానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్, రాష్ట్ర నాయకుడు ఏపూరి సోమన్న పాల్గొని ఏకలవ్య విగ్రహ ఆవిష్కరణ చేశారు. ముందుగా ఎమ్మెల్యే సామేలుకు ఎరుకలి సంఘం మహిళలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముందుగా ఏకలవ్య విగ్రహాన్ని గ్రామాల్లో ప్రతిష్టించడం ఎరుకలి సంఘం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా వారు ఏకలవ్య మహాభారతంలోని అత్యున్నత గురుభక్తికి అంకూలిత దీక్షకు ప్రతీక అని అన్నారు. నిషాద తెగకు చెందిన వారు అని, ఏకలవ్య గురువు ద్రోణాచార్యుని మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిoచి స్వయంకృషితో అర్జునుడికి సమనమైన విలువిద్యను అభ్యసించాడని గురుదక్షిణగా తన కుడిచేతి బొటనవేలను అడిగినప్పుడు సందేహించకుండా సమర్పించి త్యాగనిరతికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడని అన్నారు. ఎరుకల వారి సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చట్టసభలో ఎరుకలి కులవృత్తులను గురించి వివరించి వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, ఉపసర్పంచ్ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, జనార్ధన్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, ఏకలవ్య యూత్ సభ్యులు,గ్రామస్తులు, పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News