రామన్నపేట మండలం నీర్నంల గ్రామానికి చెందిన చిప్పలపల్లి లింగయ్య–సాలమ్మ దంపతుల కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కందిమల్ల గోపాల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వధూవరులు సుఖసంతోషాలతో జీవితాన్ని ముందుకు సాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ రామ్, సునీత–శివకుమార్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత–సత్యప్రకాశ్, నోముల దశరథ, సామాజిక కార్యకర్త నోముల యాదగిరి, ముత్యాల బిక్షం, నోముల చిరంజీవి, ఆవుల శ్రీధర్, చిప్పలపల్లి జితేందర్, సురేష్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి