Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:15 AM

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం సాధనపై ఉద్యమం ఉధృతం. నకరికంటి నరేష్

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం సాధనపై ఉద్యమం ఉధృతం. నకరికంటి నరేష్

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం సాధనపై ఉద్యమం ఉధృతం. నకరికంటి నరేష్
April 12, 2026 06:06 PM 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటను మళ్లీ ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ సాధన సమితి పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో బహుజన సమాజ్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించగా, అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధమని మండల అధ్యక్షుడు నకిరేకంటి నరేష్ తెలిపారు.

రామన్నపేటకు ప్రత్యేక రాజకీయ చరిత్ర ఉన్నదని, గతంలో పలు ప్రముఖులు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రివర్గాల్లో పనిచేశారని గుర్తు చేశారు. ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, కొమ్ము పాపయ్య వంటి నేతలు రాష్ట్ర మంత్రివర్గాల్లో సేవలందించిన విషయాన్ని ప్రస్తావించారు. వివిధ దశల్లో రెడ్డి, బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం రామన్నపేట ప్రత్యేకతగా పేర్కొన్నారు.

1952లో హైదరాబాద్ రాష్ట్ర కాలంలోనే రామన్నపేట నియోజకవర్గంగా ఏర్పడి, తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిందని వివరించారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామన్నపేటను నకిరేకల్ నియోజకవర్గంలో విలీనం చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పునర్విభజన అంశం చర్చలో ఉండటం రామన్నపేట ప్రజలకు ఆశ కలిగిస్తోందన్నారు. 2025 జూన్ 25 నుంచి అఖిలపక్షాల ఆధ్వర్యంలో సాధన సమితి వందకు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తోందని తెలిపారు.

రామన్నపేటను మళ్లీ నియోజకవర్గంగా సాధించే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగిస్తామని, అన్ని వర్గాల మద్దతుతో లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News