గొట్టిపర్తి లో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వంచ దగా విషయం; ఎమ్మెల్యే సామెల్
గొట్టిపర్తి లో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వంచ దగా విషయం; ఎమ్మెల్యే సామెల్
Bandi Kiran Kumar
మహిళలను విద్యార్థులుగా చేసేందుకు సమాజ కట్టు బాట్లను కాదనే సాహసాన్ని చేసి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయులుగా పేరుపొందిన సావిత్రిబాయి పూలే అని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. ఆదివారం గొట్టిపర్తి గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినసావిత్రిబాయి విగ్ర ప్రతిష్ట మహోత్సవంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఏపూరి సోమన్న తో కలిసి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఇప్పిచ్చిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు దశరధి రెడ్డికి ముందుగా వారిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ... గొట్టిపర్తిలో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి సావిత్రిబాయి పూలే అని అన్నారు. సావిత్రిబాయి పూలే చేసిన సాహసం ఈనాడు మహిళను విద్యార్థులుగా చేయడమే కాకుండా పురుషుల్ని మిన్నగా అవకాశము సద్వినియోగం చేసేలా తీర్చి దిద్దడం అనడంలో సందేహం లేదన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వారి ఆశాయ సాధనకు ప్రతి ఒక్కరు కృషిచేసి, వారి ఆశయాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, ఉప సర్పంచ్ శ్రీకాంత్, మాజీసింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, జనార్ధన్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కోతి రాములు, తాళ్లపల్లి యాదగిరి, మాజీ సర్పంచ్ గుమ్మడవెల్లి సోమయ్య, బర్ల సోమన్న, లింగయ్య, అరుంధతి యువజన సంఘ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి