Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ. వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 08:43 PM

గొట్టిపర్తి లో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వంచ దగా విషయం; ఎమ్మెల్యే సామెల్

గొట్టిపర్తి లో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వంచ దగా విషయం; ఎమ్మెల్యే సామెల్

గొట్టిపర్తి లో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వంచ దగా విషయం;  ఎమ్మెల్యే సామెల్
April 12, 2026 07:11 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

మహిళలను విద్యార్థులుగా చేసేందుకు సమాజ కట్టు బాట్లను కాదనే సాహసాన్ని చేసి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయులుగా పేరుపొందిన సావిత్రిబాయి పూలే అని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. ఆదివారం గొట్టిపర్తి గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినసావిత్రిబాయి విగ్ర ప్రతిష్ట మహోత్సవంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఏపూరి సోమన్న తో కలిసి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఇప్పిచ్చిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు దశరధి రెడ్డికి ముందుగా వారిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ... గొట్టిపర్తిలో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి సావిత్రిబాయి పూలే అని అన్నారు. సావిత్రిబాయి పూలే చేసిన సాహసం ఈనాడు మహిళను విద్యార్థులుగా చేయడమే కాకుండా పురుషుల్ని మిన్నగా అవకాశము సద్వినియోగం చేసేలా తీర్చి దిద్దడం అనడంలో సందేహం లేదన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వారి ఆశాయ సాధనకు ప్రతి ఒక్కరు కృషిచేసి, వారి ఆశయాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, ఉప సర్పంచ్ శ్రీకాంత్, మాజీసింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, జనార్ధన్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కోతి రాములు, తాళ్లపల్లి యాదగిరి, మాజీ సర్పంచ్ గుమ్మడవెల్లి సోమయ్య, బర్ల సోమన్న, లింగయ్య, అరుంధతి యువజన సంఘ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News