Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:10 AM

గొట్టిపర్తి లో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వంచ దగా విషయం; ఎమ్మెల్యే సామెల్

గొట్టిపర్తి లో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వంచ దగా విషయం; ఎమ్మెల్యే సామెల్

గొట్టిపర్తి లో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వంచ దగా విషయం;  ఎమ్మెల్యే సామెల్
April 12, 2026 07:11 PM 281 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

మహిళలను విద్యార్థులుగా చేసేందుకు సమాజ కట్టు బాట్లను కాదనే సాహసాన్ని చేసి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయులుగా పేరుపొందిన సావిత్రిబాయి పూలే అని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. ఆదివారం గొట్టిపర్తి గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినసావిత్రిబాయి విగ్ర ప్రతిష్ట మహోత్సవంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఏపూరి సోమన్న తో కలిసి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఇప్పిచ్చిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు దశరధి రెడ్డికి ముందుగా వారిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ... గొట్టిపర్తిలో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి సావిత్రిబాయి పూలే అని అన్నారు. సావిత్రిబాయి పూలే చేసిన సాహసం ఈనాడు మహిళను విద్యార్థులుగా చేయడమే కాకుండా పురుషుల్ని మిన్నగా అవకాశము సద్వినియోగం చేసేలా తీర్చి దిద్దడం అనడంలో సందేహం లేదన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వారి ఆశాయ సాధనకు ప్రతి ఒక్కరు కృషిచేసి, వారి ఆశయాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, ఉప సర్పంచ్ శ్రీకాంత్, మాజీసింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, జనార్ధన్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కోతి రాములు, తాళ్లపల్లి యాదగిరి, మాజీ సర్పంచ్ గుమ్మడవెల్లి సోమయ్య, బర్ల సోమన్న, లింగయ్య, అరుంధతి యువజన సంఘ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News