Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:44 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరూర్ నగర్‌లో మెరిసిన తారాజువ్వలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరూర్ నగర్‌లో మెరిసిన తారాజువ్వలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరూర్ నగర్‌లో మెరిసిన తారాజువ్వలు
12-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటుతూ ఘన విజయాన్ని నమోదు చేశారు.

BiPC ద్వితీయ సంవత్సరం విద్యార్థిని యశస్విని 1000 మార్కులకు గాను 975 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. అలాగే MPC ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నాజియా ఖాతూన్ 970 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన నాజియా ఖాతూన్ విజయ గాథ ప్రత్యేకంగా నిలిచింది. ఆమె తండ్రి అన్నారుల్ సైకిల్ పంక్చర్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి సాజా ఖాతూన్ గృహిణిగా ఉన్నారు. పేదరికాన్ని జయిస్తూ నాజియా విద్యలో ప్రతిభ కనబరిచింది.

ఇతర గ్రూపుల్లో కూడా విద్యార్థులు రాణించారు:

• CECలో ఆర్. నందిని – 920/1000

• HECలో మహేష్ – 696/1000

• A&Tలో ఎం. శ్రీకాంత్ – 962/1000

మొత్తం కళాశాలలో 65% ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ , అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయానికి ప్రిన్సిపాల్ మార్గదర్శకత్వం, అధ్యాపకుల కృషి ముఖ్య కారణమని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

యశస్వినికి అభినందనలు తెలుపుతున్న ప్రిన్సిపాల్ శ్రీమతి అనురాధ మరియు అధ్యాపక బృందం.

Sthanikam

ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరూర్ నగర్‌లో మెరిసిన తారాజువ్వలు

Article Image

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటుతూ ఘన విజయాన్ని నమోదు చేశారు.

BiPC ద్వితీయ సంవత్సరం విద్యార్థిని యశస్విని 1000 మార్కులకు గాను 975 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. అలాగే MPC ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నాజియా ఖాతూన్ 970 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన నాజియా ఖాతూన్ విజయ గాథ ప్రత్యేకంగా నిలిచింది. ఆమె తండ్రి అన్నారుల్ సైకిల్ పంక్చర్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి సాజా ఖాతూన్ గృహిణిగా ఉన్నారు. పేదరికాన్ని జయిస్తూ నాజియా విద్యలో ప్రతిభ కనబరిచింది.

ఇతర గ్రూపుల్లో కూడా విద్యార్థులు రాణించారు:

• CECలో ఆర్. నందిని – 920/1000

• HECలో మహేష్ – 696/1000

• A&Tలో ఎం. శ్రీకాంత్ – 962/1000

మొత్తం కళాశాలలో 65% ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ , అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయానికి ప్రిన్సిపాల్ మార్గదర్శకత్వం, అధ్యాపకుల కృషి ముఖ్య కారణమని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

యశస్వినికి అభినందనలు తెలుపుతున్న ప్రిన్సిపాల్ శ్రీమతి అనురాధ మరియు అధ్యాపక బృందం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News