Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటర్ ఫలితాల్లో ఎస్‌ఆర్ ప్రభంజనం – రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 09:42 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరూర్ నగర్‌లో మెరిసిన తారాజువ్వలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరూర్ నగర్‌లో మెరిసిన తారాజువ్వలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరూర్ నగర్‌లో మెరిసిన తారాజువ్వలు
April 12, 2026 08:06 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటుతూ ఘన విజయాన్ని నమోదు చేశారు.

BiPC ద్వితీయ సంవత్సరం విద్యార్థిని యశస్విని 1000 మార్కులకు గాను 975 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. అలాగే MPC ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నాజియా ఖాతూన్ 970 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన నాజియా ఖాతూన్ విజయ గాథ ప్రత్యేకంగా నిలిచింది. ఆమె తండ్రి అన్నారుల్ సైకిల్ పంక్చర్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి సాజా ఖాతూన్ గృహిణిగా ఉన్నారు. పేదరికాన్ని జయిస్తూ నాజియా విద్యలో ప్రతిభ కనబరిచింది.

ఇతర గ్రూపుల్లో కూడా విద్యార్థులు రాణించారు:

• CECలో ఆర్. నందిని – 920/1000

• HECలో మహేష్ – 696/1000

• A&Tలో ఎం. శ్రీకాంత్ – 962/1000

మొత్తం కళాశాలలో 65% ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ , అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయానికి ప్రిన్సిపాల్ మార్గదర్శకత్వం, అధ్యాపకుల కృషి ముఖ్య కారణమని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

యశస్వినికి అభినందనలు తెలుపుతున్న ప్రిన్సిపాల్ శ్రీమతి అనురాధ మరియు అధ్యాపక బృందం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News