ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరూర్ నగర్లో మెరిసిన తారాజువ్వలు
ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరూర్ నగర్లో మెరిసిన తారాజువ్వలు
Editor Desk
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటుతూ ఘన విజయాన్ని నమోదు చేశారు.
BiPC ద్వితీయ సంవత్సరం విద్యార్థిని యశస్విని 1000 మార్కులకు గాను 975 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. అలాగే MPC ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నాజియా ఖాతూన్ 970 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన నాజియా ఖాతూన్ విజయ గాథ ప్రత్యేకంగా నిలిచింది. ఆమె తండ్రి అన్నారుల్ సైకిల్ పంక్చర్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి సాజా ఖాతూన్ గృహిణిగా ఉన్నారు. పేదరికాన్ని జయిస్తూ నాజియా విద్యలో ప్రతిభ కనబరిచింది.
ఇతర గ్రూపుల్లో కూడా విద్యార్థులు రాణించారు:
• CECలో ఆర్. నందిని – 920/1000
• HECలో మహేష్ – 696/1000
• A&Tలో ఎం. శ్రీకాంత్ – 962/1000
మొత్తం కళాశాలలో 65% ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ , అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయానికి ప్రిన్సిపాల్ మార్గదర్శకత్వం, అధ్యాపకుల కృషి ముఖ్య కారణమని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
యశస్వినికి అభినందనలు తెలుపుతున్న ప్రిన్సిపాల్ శ్రీమతి అనురాధ మరియు అధ్యాపక బృందం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి