ఇంటర్ ఫలితాల్లో 'శ్రీ గాయత్రి' ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో 'శ్రీ గాయత్రి' ప్రభంజనం
K.RAVI
నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో చౌటుప్పల్లోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి స్టేట్ లెవల్ ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యుత్తమ మార్కులతో విద్యార్థులు తమ సత్తా చాటారు.
ప్రథమ సంవత్సరం (I Year):
MPC: రాచమల్ల కావ్య శ్రీ, పందుల అక్షిత, కొయ్యడ పూజ (467/470), ఎర్రగోని అక్షయ, పరిధామ్ శివకుమార్, అన్రెడ్డి అక్షిత (466/470) టాప్ మార్కులు సాధించారు.
BiPC: సి.హెచ్. గాయత్రి (437/440) అగ్రస్థానంలో నిలవగా, ఉజ్వల హర్షిత, ఎస్.డి. ఆస్పియా (436/440) తర్వాతి స్థానాల్లో నిలిచారు.CEC: రాపోలు వర్షిత (484/500) ఘన విజయం సాధించారు. ద్వితీయ సంవత్సరం (II Year):MPC: కత్తుల లీలాదిత్య (995/1000) ఏం లిఖిత (994/1000) వనం తన్విజ (993/1000)విద్యార్థులు 995, 994, 993 మార్కులతో అదరగొట్టారు.BiPC: 991, 989 మార్కులతో విద్యార్థులు రాణించారు. CEC: 930, 927 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు నమోదయ్యాయి. ద్వితీయ సంవత్సరంలో 900 మార్కులకు పైగా 112 మంది, ప్రథమ సంవత్సరంలో 400 మార్కులకు పైగా 117 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం కళాశాల రికార్డును చాటిచెబుతోంది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల కరస్పాండెంట్ భీమిడి సుబాష్ రెడ్డి మాట్లాడుతూ.. "క్రమశిక్షణ, విలువలతో కూడిన బోధన వల్లే ఈ విజయం సాధ్యమైంది. విద్యార్థుల కష్టం, అధ్యాపకుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారం మరువలేనివి" అని కొనియాడారు.కళాశాల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. "విద్యార్థులు సాధించిన ఈ ఘనత మాకు ఎంతో గర్వకారణం. కేవలం మార్కులే కాకుండా, రేపటి సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగడమే మా లక్ష్యం" అని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులను పుష్పగుచ్చాలతో సత్కరించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దయాకర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి