Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 04:52 AM

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం – మనువాద సిద్ధాంతాన్ని ఎదుర్కొందాం: కోమటిరెడ్డి చంద్రారెడ్డి

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం – మనువాద సిద్ధాంతాన్ని ఎదుర్కొందాం: కోమటిరెడ్డి చంద్రారెడ్డి

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం – మనువాద సిద్ధాంతాన్ని ఎదుర్కొందాం: కోమటిరెడ్డి చంద్రారెడ్డి
April 12, 2026 04:55 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన “భారత రాజ్యాంగ పరిరక్షణ – సవాళ్లు” సెమినార్‌లో సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బలహీనపరచే చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను నిర్లక్ష్యం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని అన్నారు. లౌకిక, సామ్యవాద భావజాలాన్ని ప్రస్తావించేందుకు ప్రభుత్వ పెద్దలు వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా రిజర్వేషన్లను క్రమంగా తగ్గించే ప్రయత్నం జరుగుతోందని, విద్యా, వైద్య రంగాల్లో పేదలకు అవకాశాలు దూరమవుతున్నాయని తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా మనువాద సిద్ధాంతాలను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

కార్మిక చట్టాల రద్దు, లేబర్ కోడ్స్ అమలు ద్వారా కార్మికుల హక్కులు క్షీణిస్తున్నాయని, యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కు, సమ్మె హక్కుపై ఆంక్షలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పని గంటలు పెరగడం, కనీస వేతనాలపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా మారనున్నాయని హెచ్చరించారు.

వ్యవసాయ, గ్రామీణ రంగాల్లో కూడా ప్రజలకు ప్రతికూల విధానాలు అమలవుతున్నాయని, ఉపాధి హామీ పథకాల భవిష్యత్తు అనిశ్చితంగా మారుతోందని తెలిపారు. ప్రజల హక్కులను కాపాడుకునేందుకు, మహనీయుల ఆశయ సాధన కోసం పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గంధముల మాతయ్య, నాయకులు ఊదరి రామచందర్, ఆడెపు వెంకటేష్, ఇటికల బిక్షపతి, బాల నరసింహ, సల్ల రాజయ్య, బట్టు కొండయ్య, రాజలింగం, వరమ్మ, శాంతమ్మ, సత్యమ్మ, సుజాత, సునీత కుమారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News