నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని నార్కెట్పల్లి మండలం యెల్లరెడ్డిగూడెం గ్రామంలో కామ్రేడ్ కల్లూరి యాదగిరి స్మారక స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ, కామ్రేడ్ కల్లూరి యాదగిరి సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవలో యాదగిరి చూపిన నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉండాలని అన్నారు.సమాజంలో సమానత్వం, సేవాభావం పెంపొందించడంలో యాదగిరి పాత్ర విశేషమని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి