Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:25 AM

యాదగిరి స్ఫూర్తి – తరాలకు మార్గదర్శి: ఎమ్మెల్యే వీరేశం

యాదగిరి స్ఫూర్తి – తరాలకు మార్గదర్శి: ఎమ్మెల్యే వీరేశం

యాదగిరి స్ఫూర్తి – తరాలకు మార్గదర్శి: ఎమ్మెల్యే వీరేశం
12-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని నార్కెట్‌పల్లి మండలం యెల్లరెడ్డిగూడెం గ్రామంలో కామ్రేడ్ కల్లూరి యాదగిరి స్మారక స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ, కామ్రేడ్ కల్లూరి యాదగిరి సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవలో యాదగిరి చూపిన నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉండాలని అన్నారు.సమాజంలో సమానత్వం, సేవాభావం పెంపొందించడంలో యాదగిరి పాత్ర విశేషమని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

యాదగిరి స్ఫూర్తి – తరాలకు మార్గదర్శి: ఎమ్మెల్యే వీరేశం

Article Image

నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని నార్కెట్‌పల్లి మండలం యెల్లరెడ్డిగూడెం గ్రామంలో కామ్రేడ్ కల్లూరి యాదగిరి స్మారక స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ, కామ్రేడ్ కల్లూరి యాదగిరి సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవలో యాదగిరి చూపిన నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉండాలని అన్నారు.సమాజంలో సమానత్వం, సేవాభావం పెంపొందించడంలో యాదగిరి పాత్ర విశేషమని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News