Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:17 AM

భక్తుల కోరికలు తీర్చే నల్లపోచమ్మ అమ్మవారు

భక్తుల కోరికలు తీర్చే నల్లపోచమ్మ అమ్మవారు

భక్తుల కోరికలు తీర్చే నల్లపోచమ్మ అమ్మవారు
12-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి అమ్మవారికి అభిషేకం చేసి పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, భక్తులు విశ్వాసంతో ప్రార్థిస్తే అమ్మవారు వారి కోరికలు నెరవేర్చుతారని తెలిపారు. మంజీర నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం సమీప గ్రామాలతో పాటు దూర ప్రాంతాల భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

Sthanikam

భక్తుల కోరికలు తీర్చే నల్లపోచమ్మ అమ్మవారు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి అమ్మవారికి అభిషేకం చేసి పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, భక్తులు విశ్వాసంతో ప్రార్థిస్తే అమ్మవారు వారి కోరికలు నెరవేర్చుతారని తెలిపారు. మంజీర నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం సమీప గ్రామాలతో పాటు దూర ప్రాంతాల భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News