ఫూలే ఆశయాలే సమాజానికి మార్గదర్శకం : కుమ్మరి రాజు
ఫూలే ఆశయాలే సమాజానికి మార్గదర్శకం : కుమ్మరి రాజు
Prabhakar
మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతిని పురస్కరించుకుని వివేకానంద రైసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గౌతమ్ నగర్ చౌరస్తాలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వివేకానంద రైసింగ్ సొసైటీ అధ్యక్షుడు
కుమ్మరి రాజు మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల విద్యా , సామాజిక అభివృద్ధికి ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.ప్రస్తుత సమాజంలో కూడా ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని, బహుజనులు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే విద్య , ఐక్యత ఎంతో అవసరమని సూచించారు. కార్యక్రమంలో మొహమ్మద్ రషీద్, శ్రీనివాస్ చారి, కే. లక్ష్మణ్ రావు, కనమల నాగరాజ్, బహుజన సంఘ నాయకులు, స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి