జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో చెక్కుల పంపిణీ
జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో చెక్కుల పంపిణీ
Editor Desk
సిరివెనికుంట గ్రామంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బోనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబు రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం బోనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన పలువురికి ఆర్థిక సహాయం అందజేశారు. రావుల దేవేందర్కు రూ.60,000, రావుల వరమ్మకు రూ.60,000, బొర్రా మంజులతకు రూ.48,000 విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలోని శిథిలావస్థకు చేరుకున్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించిన రేఖ బాబు రావు, కొత్త భవనం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, మాజీ ఎం.పీ.టి.సీ సభ్యులు గడ్డమీది చంద్రకళ వీరస్వామి గౌడ్, మండల అధ్యక్షుడు కనుకుంట్ల కొండల్, వార్డు సభ్యుడు సందెల మహేష్, చిన్నపాక బాలస్వామి, కొండ అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ ప్రభాకర్, గోపాల్, కృష్ణ, ప్రసాద్ తదితరులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి