Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:41 PM

జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో చెక్కుల పంపిణీ

జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో చెక్కుల పంపిణీ

జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో చెక్కుల పంపిణీ
12-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిరివెనికుంట గ్రామంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బోనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబు రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం బోనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన పలువురికి ఆర్థిక సహాయం అందజేశారు. రావుల దేవేందర్‌కు రూ.60,000, రావుల వరమ్మకు రూ.60,000, బొర్రా మంజులతకు రూ.48,000 విలువైన చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామంలోని శిథిలావస్థకు చేరుకున్న అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించిన రేఖ బాబు రావు, కొత్త భవనం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, మాజీ ఎం.పీ.టి.సీ సభ్యులు గడ్డమీది చంద్రకళ వీరస్వామి గౌడ్, మండల అధ్యక్షుడు కనుకుంట్ల కొండల్, వార్డు సభ్యుడు సందెల మహేష్, చిన్నపాక బాలస్వామి, కొండ అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ ప్రభాకర్, గోపాల్, కృష్ణ, ప్రసాద్ తదితరులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో చెక్కుల పంపిణీ

Article Image

సిరివెనికుంట గ్రామంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బోనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబు రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం బోనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన పలువురికి ఆర్థిక సహాయం అందజేశారు. రావుల దేవేందర్‌కు రూ.60,000, రావుల వరమ్మకు రూ.60,000, బొర్రా మంజులతకు రూ.48,000 విలువైన చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామంలోని శిథిలావస్థకు చేరుకున్న అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించిన రేఖ బాబు రావు, కొత్త భవనం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, మాజీ ఎం.పీ.టి.సీ సభ్యులు గడ్డమీది చంద్రకళ వీరస్వామి గౌడ్, మండల అధ్యక్షుడు కనుకుంట్ల కొండల్, వార్డు సభ్యుడు సందెల మహేష్, చిన్నపాక బాలస్వామి, కొండ అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ ప్రభాకర్, గోపాల్, కృష్ణ, ప్రసాద్ తదితరులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News