డీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి
డీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి
Editor Desk
డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా బీసీ హాస్టల్ వార్డెన్లు హనుమ రెడ్డి, రాజశేఖర్, యమునా, సుప్రియ హాజరయ్యారు.
వక్తలు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే చేసిన త్యాగాలను స్మరించుకోవాలని, కుల నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన, బడుగు బలహీన వర్గాలకు అవగాహన కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు. పూలే, సావిత్రిబాయి పూలే చేసిన కృషి వల్లనే నేడు సమాజం స్వేచ్ఛగా ముందుకు సాగుతోందన్నారు.
విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరాలని, మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి