Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

19న చౌటుప్పల్‌లో ‘హిందూ సమ్మేళనం’ ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా ప్రచారక్‌ పిలుపు ​

19న చౌటుప్పల్‌లో ‘హిందూ సమ్మేళనం’ ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా ప్రచారక్‌ పిలుపు ​

19న చౌటుప్పల్‌లో ‘హిందూ సమ్మేళనం’ ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా ప్రచారక్‌ పిలుపు ​
11-04-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో ఈనెల 19వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఉప మండల స్థాయి 'హిందూ సమ్మేళనం' కార్యక్రమాన్ని భక్తులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా ప్రచారక్ కృష్ణయ్య కోరారు. శనివారం చౌటుప్పల్‌లో హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు కేవీబీ కృష్ణారావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ భారీ కార్యక్రమ నిర్వహణ కోసం 51 మంది సభ్యులతో కూడిన 'హిందూ సమ్మేళన సమితి'ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమ్మేళనానికి సంబంధించిన గోడపత్రిక (బ్రోచర్)ను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో కార్యక్రమ వేదిక నిర్వహణ, ఏర్పాట్లు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హిందూ సమాజాన్ని ఏకం చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.​ఈ సమావేశంలో హిందూ సమ్మేళన సమితి ప్రధాన కార్యదర్శి కొసనం రామిరెడ్డి, కోశాధికారి కర్నాటి శ్రీనివాస్‌, కమిటీలోని 48 మంది కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

19న చౌటుప్పల్‌లో ‘హిందూ సమ్మేళనం’ ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా ప్రచారక్‌ పిలుపు ​

Article Image

చౌటుప్పల్‌లో ఈనెల 19వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఉప మండల స్థాయి 'హిందూ సమ్మేళనం' కార్యక్రమాన్ని భక్తులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా ప్రచారక్ కృష్ణయ్య కోరారు. శనివారం చౌటుప్పల్‌లో హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు కేవీబీ కృష్ణారావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ భారీ కార్యక్రమ నిర్వహణ కోసం 51 మంది సభ్యులతో కూడిన 'హిందూ సమ్మేళన సమితి'ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమ్మేళనానికి సంబంధించిన గోడపత్రిక (బ్రోచర్)ను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో కార్యక్రమ వేదిక నిర్వహణ, ఏర్పాట్లు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హిందూ సమాజాన్ని ఏకం చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.​ఈ సమావేశంలో హిందూ సమ్మేళన సమితి ప్రధాన కార్యదర్శి కొసనం రామిరెడ్డి, కోశాధికారి కర్నాటి శ్రీనివాస్‌, కమిటీలోని 48 మంది కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News