19న చౌటుప్పల్లో ‘హిందూ సమ్మేళనం’ ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ పిలుపు
19న చౌటుప్పల్లో ‘హిందూ సమ్మేళనం’ ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ పిలుపు
K.RAVI
చౌటుప్పల్లో ఈనెల 19వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఉప మండల స్థాయి 'హిందూ సమ్మేళనం' కార్యక్రమాన్ని భక్తులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా ప్రచారక్ కృష్ణయ్య కోరారు. శనివారం చౌటుప్పల్లో హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు కేవీబీ కృష్ణారావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ భారీ కార్యక్రమ నిర్వహణ కోసం 51 మంది సభ్యులతో కూడిన 'హిందూ సమ్మేళన సమితి'ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమ్మేళనానికి సంబంధించిన గోడపత్రిక (బ్రోచర్)ను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో కార్యక్రమ వేదిక నిర్వహణ, ఏర్పాట్లు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హిందూ సమాజాన్ని ఏకం చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో హిందూ సమ్మేళన సమితి ప్రధాన కార్యదర్శి కొసనం రామిరెడ్డి, కోశాధికారి కర్నాటి శ్రీనివాస్, కమిటీలోని 48 మంది కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి