Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణతోనే లక్ష్యసాధన – స్ఫూర్తి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 09:24 PM

మహిళ, చిన్నారి అదృశ్యం – ఘటన స్థలంలోనే FIR నమోదు

మహిళ, చిన్నారి అదృశ్యం – ఘటన స్థలంలోనే FIR నమోదు

మహిళ, చిన్నారి అదృశ్యం – ఘటన స్థలంలోనే FIR నమోదు
April 12, 2026 07:47 PM 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో మహిళ మరియు చిన్నారి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాపట్ల జిల్లా నుంచి సుమారు 8 సంవత్సరాల క్రితం రామన్నపేటకు వచ్చి మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న కుంచపు బాలరాజుకు రెండు సంవత్సరాల క్రితం రజిని (20)తో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం ఒక సంవత్సరం వయస్సు గల కూతురు ఉంది.

ఈ నెల 11.04.2026 ఉదయం ఎప్పటిలాగే పనికి వెళ్లిన బాలరాజు సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకోగా భార్య, కూతురు ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.ఇట్టి సమాచారం రామన్నపేట ఎస్ఐ డి. నాగరాజు తెలవడంతో స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ బి. కమలాకర్, రైటర్ స్వామి నాయక్ సంఘటన స్థలానికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. కేసు అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని సంఘటన స్థలంలోనే ఆన్-సైట్ FIR నమోదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి మహిళ, చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News