మహిళ, చిన్నారి అదృశ్యం – ఘటన స్థలంలోనే FIR నమోదు
మహిళ, చిన్నారి అదృశ్యం – ఘటన స్థలంలోనే FIR నమోదు
Editor Desk
రామన్నపేట మండలంలో మహిళ మరియు చిన్నారి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాపట్ల జిల్లా నుంచి సుమారు 8 సంవత్సరాల క్రితం రామన్నపేటకు వచ్చి మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న కుంచపు బాలరాజుకు రెండు సంవత్సరాల క్రితం రజిని (20)తో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం ఒక సంవత్సరం వయస్సు గల కూతురు ఉంది.
ఈ నెల 11.04.2026 ఉదయం ఎప్పటిలాగే పనికి వెళ్లిన బాలరాజు సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకోగా భార్య, కూతురు ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.ఇట్టి సమాచారం రామన్నపేట ఎస్ఐ డి. నాగరాజు తెలవడంతో స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ బి. కమలాకర్, రైటర్ స్వామి నాయక్ సంఘటన స్థలానికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. కేసు అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని సంఘటన స్థలంలోనే ఆన్-సైట్ FIR నమోదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి మహిళ, చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి