Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:31 AM

మహిళ, చిన్నారి అదృశ్యం – ఘటన స్థలంలోనే FIR నమోదు

మహిళ, చిన్నారి అదృశ్యం – ఘటన స్థలంలోనే FIR నమోదు

మహిళ, చిన్నారి అదృశ్యం – ఘటన స్థలంలోనే FIR నమోదు
April 12, 2026 07:47 PM 177 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో మహిళ మరియు చిన్నారి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాపట్ల జిల్లా నుంచి సుమారు 8 సంవత్సరాల క్రితం రామన్నపేటకు వచ్చి మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న కుంచపు బాలరాజుకు రెండు సంవత్సరాల క్రితం రజిని (20)తో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం ఒక సంవత్సరం వయస్సు గల కూతురు ఉంది.

ఈ నెల 11.04.2026 ఉదయం ఎప్పటిలాగే పనికి వెళ్లిన బాలరాజు సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకోగా భార్య, కూతురు ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.ఇట్టి సమాచారం రామన్నపేట ఎస్ఐ డి. నాగరాజు తెలవడంతో స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ బి. కమలాకర్, రైటర్ స్వామి నాయక్ సంఘటన స్థలానికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. కేసు అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని సంఘటన స్థలంలోనే ఆన్-సైట్ FIR నమోదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి మహిళ, చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News