వీధి కుక్కల నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలి: సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ
వీధి కుక్కల నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలి: సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ
Sthanikam District Staff Reporter
భువనగిరి పట్టణంలో వీధి కుక్కలు,కోతుల సమస్య తీవ్రంగా మారిందని సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య మాట్లాడుతూ,ప్రతి కాలనీలో వీధి కుక్కలు మరియు కోతుల బెడద పెరిగి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.పాలకులు,అధికారులు పట్టణ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వచ్చినప్పటికీ,వాటిని సరైన విధంగా వినియోగించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.ఎన్నికల ముందు నాయకులు వీధి కుక్కల సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.కుక్కలు, కోతుల సంతానోత్పత్తిని నియంత్రించేందుకు టీకాలు వేయడం,కరిచిన వారికి తక్షణ వైద్యం అందించడం వంటి చర్యలు తీసుకోవాలని సిపిఐఎం పట్టణ కమిటీ డిమాండ్ చేసింది.ఇటీవల కుక్క దాడిలో గాయపడి చూపు కోల్పోయిన బాలుడికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని,అతనికి మంచి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యను అందించాలని కోరారు.వారం రోజుల్లో వీధి కుక్కలు,కోతులను పట్టణంలోని ప్రధాన వీధుల నుంచి తొలగించాలని,తారకరామ నగర్,ఆర్బి నగర్ ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి