వేంబావిలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా
వేంబావిలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా
Komidala Mahender reddy
వేంబావి గ్రామంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రావు జయంతివేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానికులు విశేషంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక సమానత్వం, దళితుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పలువురు ప్రసంగించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ నక్క శివ, వార్డు సభ్యులు ఓర్స్ అలివేలు, ఉయ్యాల ధనమ్మ, పంగరేఖ ప్రసాద్, గుణగంటి బిక్షపతి, నక్క జానయ్య, మాధగోని లింగయ్య, కొనుగోడు మాధగోని లింగయ్య, పొనుగోటి సత్యనారాయణ రావు, పాండురావు, గుండు శ్రీరాములు, గుండు మౌనిక, పంగారెక ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.గ్రామంలో ఐక్యతా వాతావరణంలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలు ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి