Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో హరీష్ రావుకు ఆత్మీయ స్వాగతం బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 09:10 PM

వీఆర్వో వింత ప్రవర్తన

వీఆర్వో వింత ప్రవర్తన

 వీఆర్వో వింత ప్రవర్తన
May 07, 2026 08:16 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ విఆర్ఓ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసి ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు, ఇంటర్మీడియట్ అనంతరం ఎంసెట్ రాసే విద్యార్థులు, అలాగే నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం నమోదు చేసుకునే అభ్యర్థులకు ఓబీసీ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ప్రజలు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు.

అయితే ప్రభుత్వ నిబంధనలను ఆసరాగా చేసుకొని సంబంధిత విఆర్ఓ విద్యార్థులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా విఆర్ఓ లాగిన్ ద్వారానే జరిగే “నవశకం అప్లికేషన్” ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి, “మీసేవలో చేయించుకోండి” అంటూ విద్యార్థులను పదేపదే తిప్పిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

ఇంకా తీవ్ర ఆరోపణ ఏమిటంటే… ఓ మీసేవ నిర్వాహకుడికి విఆర్ఓ లాగిన్ వివరాలు ఇచ్చి, నవశకం అప్లికేషన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాల్సిన అధికారులే మధ్యవర్తిత్వానికి తావిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఓబీసీ సర్టిఫికెట్ కోసం రోజులు తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చదువుల కోసం సమయాన్ని కేటాయించాల్సిన సమయంలో కార్యాలయాల వద్ద అవస్థలు పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News