Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:10 AM

వీఆర్వో వింత ప్రవర్తన

వీఆర్వో వింత ప్రవర్తన

 వీఆర్వో వింత ప్రవర్తన
07-05-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ విఆర్ఓ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసి ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు, ఇంటర్మీడియట్ అనంతరం ఎంసెట్ రాసే విద్యార్థులు, అలాగే నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం నమోదు చేసుకునే అభ్యర్థులకు ఓబీసీ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ప్రజలు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు.

అయితే ప్రభుత్వ నిబంధనలను ఆసరాగా చేసుకొని సంబంధిత విఆర్ఓ విద్యార్థులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా విఆర్ఓ లాగిన్ ద్వారానే జరిగే “నవశకం అప్లికేషన్” ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి, “మీసేవలో చేయించుకోండి” అంటూ విద్యార్థులను పదేపదే తిప్పిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

ఇంకా తీవ్ర ఆరోపణ ఏమిటంటే… ఓ మీసేవ నిర్వాహకుడికి విఆర్ఓ లాగిన్ వివరాలు ఇచ్చి, నవశకం అప్లికేషన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాల్సిన అధికారులే మధ్యవర్తిత్వానికి తావిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఓబీసీ సర్టిఫికెట్ కోసం రోజులు తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చదువుల కోసం సమయాన్ని కేటాయించాల్సిన సమయంలో కార్యాలయాల వద్ద అవస్థలు పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

వీఆర్వో వింత ప్రవర్తన

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ విఆర్ఓ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసి ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు, ఇంటర్మీడియట్ అనంతరం ఎంసెట్ రాసే విద్యార్థులు, అలాగే నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం నమోదు చేసుకునే అభ్యర్థులకు ఓబీసీ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ప్రజలు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు.

అయితే ప్రభుత్వ నిబంధనలను ఆసరాగా చేసుకొని సంబంధిత విఆర్ఓ విద్యార్థులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా విఆర్ఓ లాగిన్ ద్వారానే జరిగే “నవశకం అప్లికేషన్” ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి, “మీసేవలో చేయించుకోండి” అంటూ విద్యార్థులను పదేపదే తిప్పిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

ఇంకా తీవ్ర ఆరోపణ ఏమిటంటే… ఓ మీసేవ నిర్వాహకుడికి విఆర్ఓ లాగిన్ వివరాలు ఇచ్చి, నవశకం అప్లికేషన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాల్సిన అధికారులే మధ్యవర్తిత్వానికి తావిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఓబీసీ సర్టిఫికెట్ కోసం రోజులు తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చదువుల కోసం సమయాన్ని కేటాయించాల్సిన సమయంలో కార్యాలయాల వద్ద అవస్థలు పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News