వ్యవసాయానికి 10% బడ్జెట్ కేటాయించాలి – ముసునూరులో రైతుల గళమెత్తింపు
వ్యవసాయానికి 10% బడ్జెట్ కేటాయించాలి – ముసునూరులో రైతుల గళమెత్తింపు
GADDAM JAGANMOHAN REDDY
ముసునూరులో తహసీల్దార్కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతిపత్రం
ముసునూరు : ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి గత సంవత్సరం కంటే తక్కువ కేటాయింపులు చేసినట్లు పేర్కొంటూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి కనీసం 10 శాతం బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ముసునూరు తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు సహా అన్ని రకాల సబ్సిడీలను కొనసాగించాలని రైతు సంఘం నేతలు కోరారు. ఎరువులు, విత్తనాలు, విద్యుత్, సాగునీటి సదుపాయాలపై సబ్సిడీలు తగ్గించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, కూచిపూడి నాగేశ్వరరావు, మన్మధరావు, చంగల వెంకటేశ్వరరావు, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడు వేముల బక్కయ్య, పల్లెపాము భవాని తదితర రైతులు పాల్గొన్నారు. రైతుల సమక్షంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సంఘం నేతలు హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి