Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:33 AM

వ్యవసాయానికి 10% బడ్జెట్ కేటాయించాలి – ముసునూరులో రైతుల గళమెత్తింపు

వ్యవసాయానికి 10% బడ్జెట్ కేటాయించాలి – ముసునూరులో రైతుల గళమెత్తింపు

వ్యవసాయానికి 10% బడ్జెట్ కేటాయించాలి – ముసునూరులో రైతుల గళమెత్తింపు
24-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముసునూరులో తహసీల్దార్‌కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతిపత్రం

ముసునూరు : ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి గత సంవత్సరం కంటే తక్కువ కేటాయింపులు చేసినట్లు పేర్కొంటూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి కనీసం 10 శాతం బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ముసునూరు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు సహా అన్ని రకాల సబ్సిడీలను కొనసాగించాలని రైతు సంఘం నేతలు కోరారు. ఎరువులు, విత్తనాలు, విద్యుత్, సాగునీటి సదుపాయాలపై సబ్సిడీలు తగ్గించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, కూచిపూడి నాగేశ్వరరావు, మన్మధరావు, చంగల వెంకటేశ్వరరావు, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడు వేముల బక్కయ్య, పల్లెపాము భవాని తదితర రైతులు పాల్గొన్నారు. రైతుల సమక్షంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సంఘం నేతలు హెచ్చరించారు.

Sthanikam

వ్యవసాయానికి 10% బడ్జెట్ కేటాయించాలి – ముసునూరులో రైతుల గళమెత్తింపు

Article Image

ముసునూరులో తహసీల్దార్‌కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతిపత్రం

ముసునూరు : ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి గత సంవత్సరం కంటే తక్కువ కేటాయింపులు చేసినట్లు పేర్కొంటూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి కనీసం 10 శాతం బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ముసునూరు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు సహా అన్ని రకాల సబ్సిడీలను కొనసాగించాలని రైతు సంఘం నేతలు కోరారు. ఎరువులు, విత్తనాలు, విద్యుత్, సాగునీటి సదుపాయాలపై సబ్సిడీలు తగ్గించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, కూచిపూడి నాగేశ్వరరావు, మన్మధరావు, చంగల వెంకటేశ్వరరావు, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడు వేముల బక్కయ్య, పల్లెపాము భవాని తదితర రైతులు పాల్గొన్నారు. రైతుల సమక్షంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సంఘం నేతలు హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News