వ్యవసాయాభివృద్ధికి కీలక అడుగు – ఖేఢ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
వ్యవసాయాభివృద్ధికి కీలక అడుగు – ఖేఢ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం వసర్ గ్రామంలో నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన “వసర్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్” నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు, భూమి సంరక్షణ మరియు వ్యవసాయ అభివృద్ధికి వాటర్ షెడ్ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వసర్ మరియు పరిసర ప్రాంతాల రైతులకు గణనీయమైన మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యాలయం ద్వారా వాటర్ షెడ్ పనులను పర్యవేక్షిస్తూ రైతులకు సాంకేతిక సూచనలు, అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ అధికారులు దండం కృష్ణ తేజ, ఆర్ఓ రాధ రాణి, ఏడీఏ నూతన్ కుమార్, ఎన్జీవో చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ హన్మంత్, ఉప సర్పంచ్ విఠల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి