Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:24 AM

వ్యవసాయాభివృద్ధికి కీలక అడుగు – ఖేఢ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

వ్యవసాయాభివృద్ధికి కీలక అడుగు – ఖేఢ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

వ్యవసాయాభివృద్ధికి కీలక అడుగు – ఖేఢ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
31-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం వసర్ గ్రామంలో నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన “వసర్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్” నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు, భూమి సంరక్షణ మరియు వ్యవసాయ అభివృద్ధికి వాటర్ షెడ్ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వసర్ మరియు పరిసర ప్రాంతాల రైతులకు గణనీయమైన మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యాలయం ద్వారా వాటర్ షెడ్ పనులను పర్యవేక్షిస్తూ రైతులకు సాంకేతిక సూచనలు, అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ అధికారులు దండం కృష్ణ తేజ, ఆర్‌ఓ రాధ రాణి, ఏడీఏ నూతన్ కుమార్, ఎన్‌జీవో చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ హన్మంత్, ఉప సర్పంచ్ విఠల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యవసాయాభివృద్ధికి కీలక అడుగు – ఖేఢ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం వసర్ గ్రామంలో నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన “వసర్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్” నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు, భూమి సంరక్షణ మరియు వ్యవసాయ అభివృద్ధికి వాటర్ షెడ్ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వసర్ మరియు పరిసర ప్రాంతాల రైతులకు గణనీయమైన మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యాలయం ద్వారా వాటర్ షెడ్ పనులను పర్యవేక్షిస్తూ రైతులకు సాంకేతిక సూచనలు, అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ అధికారులు దండం కృష్ణ తేజ, ఆర్‌ఓ రాధ రాణి, ఏడీఏ నూతన్ కుమార్, ఎన్‌జీవో చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ హన్మంత్, ఉప సర్పంచ్ విఠల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News