Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సిఐ,ఎస్ఐ ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 15, 2026 07:27 PM

వ్యవసాయ కార్మిక సంఘం సభను జయప్రదం చేయాలి

వ్యవసాయ కార్మిక సంఘం సభను జయప్రదం చేయాలి

వ్యవసాయ కార్మిక సంఘం సభను జయప్రదం చేయాలి
May 15, 2026 06:27 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభల సందర్భంగా ఈనెల 18న రామన్నపేటలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కందుల హనుమంతు, కార్యదర్శి మేడి ముకుంద మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేక పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిందన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఈ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఫోటో క్యాప్షన్ విధానంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా పని దొరకక వెనుదిరిగే పరిస్థితి నెలకొందన్నారు. పనిచేసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈనెల 18న జరిగే మహాసభల బహిరంగ సభకు ఆల్ ఇండియా కార్యదర్శి బి. వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్రాములు హాజరవుతారని తెలిపారు. వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

కార్యక్రమంలో వేముల సైదులు, కన్నెబోయిన యాదయ్య, నీల సంతోష్, మమత, నాగమణి, పార్వతమ్మ, అండాలు, రాధ, కల్పన, లక్ష్మి, కవిత, మంజుల తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News