Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 02:51 AM

వ్యవసాయ కార్మిక సంఘం సభను జయప్రదం చేయాలి

వ్యవసాయ కార్మిక సంఘం సభను జయప్రదం చేయాలి

వ్యవసాయ కార్మిక సంఘం సభను జయప్రదం చేయాలి
May 15, 2026 06:27 PM 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభల సందర్భంగా ఈనెల 18న రామన్నపేటలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కందుల హనుమంతు, కార్యదర్శి మేడి ముకుంద మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేక పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిందన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఈ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఫోటో క్యాప్షన్ విధానంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా పని దొరకక వెనుదిరిగే పరిస్థితి నెలకొందన్నారు. పనిచేసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈనెల 18న జరిగే మహాసభల బహిరంగ సభకు ఆల్ ఇండియా కార్యదర్శి బి. వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్రాములు హాజరవుతారని తెలిపారు. వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

కార్యక్రమంలో వేముల సైదులు, కన్నెబోయిన యాదయ్య, నీల సంతోష్, మమత, నాగమణి, పార్వతమ్మ, అండాలు, రాధ, కల్పన, లక్ష్మి, కవిత, మంజుల తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News