వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలి.ఉపాధి కూలీల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం. సిపిఎం
వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలి.ఉపాధి కూలీల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం. సిపిఎం
Editor Desk
రామన్నపేట,
ఈనెల 18, 19 తేదీల్లో రామన్నపేటలో నిర్వహించనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని సంఘం మండల అధ్యక్షుడు మేడి ముకుంద, కార్యదర్శి కందుల హనుమంతు పిలుపునిచ్చారు.
కొమ్మాయిగూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీల పని ప్రదేశంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని, ఎండల తీవ్రత దృష్ట్యా నీడ, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు రామన్నపేటలో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో కూలీలు పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఎర్ర అలివేలు, కార్యదర్శిగా శానగొండ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఎర్ర కమలమ్మ, బుర్ర పుష్ప, సహాయ కార్యదర్శులుగా దగ్గుల మారమ్మ, గురుజాల సునీత, కొండగడప అన్నపూర్ణ, కోణాల నరసమ్మ, పోషబోయిన మమత ఎన్నికయ్యారు.
కార్యక్రమంలో శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి