Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 12:48 AM

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలి.ఉపాధి కూలీల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం. సిపిఎం

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలి.ఉపాధి కూలీల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం. సిపిఎం

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలి.ఉపాధి కూలీల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం. సిపిఎం
May 14, 2026 06:20 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ఈనెల 18, 19 తేదీల్లో రామన్నపేటలో నిర్వహించనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని సంఘం మండల అధ్యక్షుడు మేడి ముకుంద, కార్యదర్శి కందుల హనుమంతు పిలుపునిచ్చారు.

కొమ్మాయిగూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీల పని ప్రదేశంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని, ఎండల తీవ్రత దృష్ట్యా నీడ, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు రామన్నపేటలో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో కూలీలు పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఎర్ర అలివేలు, కార్యదర్శిగా శానగొండ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఎర్ర కమలమ్మ, బుర్ర పుష్ప, సహాయ కార్యదర్శులుగా దగ్గుల మారమ్మ, గురుజాల సునీత, కొండగడప అన్నపూర్ణ, కోణాల నరసమ్మ, పోషబోయిన మమత ఎన్నికయ్యారు.

కార్యక్రమంలో శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News