తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ కోరారు. మే 18, 19 తేదీల్లో రామన్నపేట మండల కేంద్రంలో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గత మూడున్నరేళ్లుగా జిల్లాలో వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం, భూ పంపిణీ నిషేధం ఎత్తివేయడం, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడం వంటి అంశాలపై ఉద్యమాలు చేపట్టినట్లు తెలిపారు.
ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించామని చెప్పారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, విద్య, వైద్యం, ఉపాధి హక్కులను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 18న సాయంత్రం రామన్నపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.
19వ తేదీన జరిగే ప్రతినిధుల మహాసభకు జిల్లా నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని నర్సింహ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి