Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:55 AM

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు పిలుపు

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు పిలుపు

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు పిలుపు
17-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ కోరారు. మే 18, 19 తేదీల్లో రామన్నపేట మండల కేంద్రంలో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గత మూడున్నరేళ్లుగా జిల్లాలో వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్‌బుక్లు ఇవ్వడం, భూ పంపిణీ నిషేధం ఎత్తివేయడం, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడం వంటి అంశాలపై ఉద్యమాలు చేపట్టినట్లు తెలిపారు.

ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించామని చెప్పారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, విద్య, వైద్యం, ఉపాధి హక్కులను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 18న సాయంత్రం రామన్నపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.

19వ తేదీన జరిగే ప్రతినిధుల మహాసభకు జిల్లా నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని నర్సింహ కోరారు.

Sthanikam

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు పిలుపు

Article Image

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ కోరారు. మే 18, 19 తేదీల్లో రామన్నపేట మండల కేంద్రంలో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గత మూడున్నరేళ్లుగా జిల్లాలో వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్‌బుక్లు ఇవ్వడం, భూ పంపిణీ నిషేధం ఎత్తివేయడం, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడం వంటి అంశాలపై ఉద్యమాలు చేపట్టినట్లు తెలిపారు.

ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించామని చెప్పారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, విద్య, వైద్యం, ఉపాధి హక్కులను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 18న సాయంత్రం రామన్నపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.

19వ తేదీన జరిగే ప్రతినిధుల మహాసభకు జిల్లా నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని నర్సింహ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News