PRINT TIME: May 26, 2026 04:33 PM
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు
May 21, 2026 05:28 PM
24 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఉద్యమ బలోపేతానికి కృషి చేస్తాం : హనుమంతు, ముకుందం
రామన్నపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున గార్డెన్లో ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలో కందుల హనుమంతు, మేడి ముకుందంను జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి జల్లెల పెంటయ్య సహకారంతో తమ ఎన్నిక జరిగిందన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
వేముల మహేందర్, రొడ్డ అంజయ్య అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి